బెంగుళూరు టెస్ట్: మెక్‌కల్లమ్ డకౌట్ 106/3

భారత్ న్యూజిలాండ్ మధ్య బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో ఈరోజు ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ మెక్‌కల్లమ్ టీమిండియా ఫేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరుకోగా, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విలియమ్సన్ 17‌, మరో ఓపెనర్ గుప్తిల్‌ 53ను ఓజా అవుట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులోరాస్ టేలర్ 27,ఫ్లిన్ 5 తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో పడ్డారు.

 

భారత్: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, చటేశ్వర పుజారా, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, జహీర్ ఖాన్, ఉమేశ్ యాదవ్, ప్రజ్ఞాన్ ఓజా
న్యూజిలాండ్: రాస్ టేలర్ (కెప్టెన్), బ్రెండడ్ మెక్‌కల్లమ్, గుప్టిల్, విలియమ్సన్, ఫ్లిన్, ఫ్రాంక్లిన్, వాన్ విక్, బ్రేస్‌వెల్, పటేల్, బౌల్ట్, సౌధీ.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.