మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ ఇక లేరు
posted on Nov 30, 2012 @ 3:40PM
మాజీ ప్రధాని ఐకె గుజ్రాల్ 93 కొద్ది సేపటి క్రిత౦ మరణించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ గుర్గావ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పూర్తి ఇంద్ర కిరణ్ గుజ్రాల్. వీపీ సింగ్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1997 ఏప్రిల్ 21 నుండి 19 మార్చ్ 1998 వరకు ఆయన దేశ 12వ ప్రధానిగా పనిచేశారు. 1919 డిసెంబరు 4న ఆయన పాకిస్తాన్ లోని పంజాబ్ లో జన్మించారు. వీపీసింగ్, దేవెగౌడలు ప్రధానులుగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. 1988కి ముందు కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన ఆ తరువాత జనతాదళ్ లో చేరారు.