వితంతు మహిళకు పోలీసుల వేధింపులు..
posted on Jul 27, 2021 @ 4:28PM
అది హైదరాబాద్. బాలానగర్ శోభన కాలనీలో ఒక వితంతు నివాసముంటుంది. మహిళలపై సామాన్యులే కాదు చివరికి పోలీసులు కూడా వేధిస్తున్నారు. ఆ వితంతువు నివసిస్తున్న ఇంటి స్థలాన్ని వదిలి వెళ్లాలని పోలీసులు బెదిరించారు. చివరికి పోలీసుల వేధింపులు భరించలేక ఇద్దరు మహిళలు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
బాలానగర్ లో దారుణం చోటుచేసుకుంది. అసలే ఆమె వితంతు. అందులోను మహిళ. వాళ్లను బెదిరించిన, ధమ్కీ ఇచ్చిన ఎవరు ఏం చేయలేరని గ్రహించారు. అదే అదును చేసుకొని కొంతకాలంగా ఆమె కుటుంబానికి పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. చివరికి ఆ మహిళా చేసేది ఏమి లేక నిస్సహాయ స్థితిలో తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని. బాధితులు వేధింపులు భరించలేక బాలానగర్ ACP పురుషోత్తం, CI వహీదుద్దేన్ పై హెచ్చార్సీలో పిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బాలానగర్ శోభన కాలనీకి చెందిన లక్ష్మీ అనే వితంతు మహిళ ముగ్గురు పిల్లలతో 20 సం.లుగా జీవనం సాగిస్తోంది. తాము నివాసం ఉంటున్న ఇంటి స్థలాన్ని వదిలి వెళ్లాలని కొంత కాలంగా పోలీసులు బెదిరిస్తున్నారని, లక్ష్మితో పాటు మరో బాధితురాలు దంతాల సంధ్య హెచ్చార్సీలో పిర్యాదు చేశారు. కబ్జాదారులు దేవి ఇస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే చివరకు తమ కుటుంబాన్ని కబ్జా దారులతో కుమ్మకై ACP, CI లు కూడా వేధింపులకు గుర్తిచేస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లిన అడ్డుకుంటే కొంత అన్నమైన దొరుకుతుందేమో గానీ పేదవాడికి న్యాయం దొరకదు అని వకీల్ సాబ్ సినిమాలో చెప్పినట్లు.. ఎక్కడికి వెళ్లిన తనకు న్యాయం జరగకపోవడంతో.. కబ్జాదారులు వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు డయల్ 100 కి కాల్ చేస్తే పోలీసులు అర్ధరాత్రి మహిళలను సెటిల్ మెంట్ కోసం పోలీస్ స్టేషన్ కి రమ్మంటున్నారు. కబ్జాదారు లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షంలో చంపేస్తామని బెదిరిస్తున్నారు. కబ్జాదారులు, ACP, CI ల నుండి ప్రాణ హాని ఉంది.. వారి నుండి రక్షణ కల్పించాంటూ ఆమె కోరుతున్నారు. దంతాల సంధ్య, లక్ష్మి ఇద్దరు బాధితురాలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.