కార్మికుల పాదయాత్ర ఉద్రిక్తం..
posted on Feb 19, 2021 @ 3:55PM
రోజంతా రోడ్లు ఊడుస్తారు. చెత్త శుభ్రం చేస్తారు. నగరాన్ని క్లీన్ గా ఉంచుతారు. ఇంత కష్టం చేసినా.. సమయానికి జీతాలు మాత్రం ఇవ్వరు. ఇవీ జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ పారిశుద్ద్య కార్మికుల కష్టాలు. మూడు నెలలుగా సరిగ్గా సాలరీ ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయింటుకుంటే ఎలా? పూట ఎలా గడిచేది? అందుకే, వెంటనే జీతాలు చెల్లించాలంటూ రోడ్డెక్కారు బాధితులు. చార్మినార్ నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వరకు కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ వేల సంఖ్యలో బల్దియా కార్మికులు ఆందోళనకు దిగారు. తమను ఉద్యోగాల్లో తీసుకొని.. ఇబ్బందులకు గురి చేస్తున్న రాంకీ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాంకీ కంపెనీని జీహెచ్ఎంసీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.