భార్య పై భర్త తన నలుగురు స్నేహితులతో కలిసి 15 రోజులు దారుణం..
posted on Jul 24, 2021 @ 11:46AM
మహిళలపై రోజు ఎక్కడ చూసిన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై జరుగుతున్న దాడులను అదుపులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వాలు, కోర్టులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఆ చట్టాలను లేకచేయడం లేదు కొంత మంది దుర్మార్గులు. ప్రేమించలేదని ఒకడు, తనతో మాట్లాడలేదని మరొకడు. కామంతో ఇంకొకడు, ఇలా రకరకాలుగా ఆడవాళ్లపై నిత్యం దాడులు చేస్తున్నారు. తాజాగా కట్నం కోసం భార్యను వేధించిన ప్రబుద్ధుడు.. అంతే కాదు ఆమెపై తన స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు వారాలు నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారు.
ధర్మార్ధ కామ మోక్షములలో ఎప్పుడు తోడు ఉంటాను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసిన కట్టుకున్న వాడే , భార్య పాలిట యముడయ్యాడు. రక్షణగా ఉండాల్సిన కట్టుకున్నవాడే తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్బంధించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను రోజులపాటు ఆమెపై భర్తతో సహా ఐదుగురు ఆఘాయిత్యం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని భార్యను చిత్రహింసలకు గురిచేసి, అనంతరం ఆమెకు తలాక్ చెప్పాడు. ఈ అమానవీయ సంఘటనకు పాలుపడ్డాడు ఆ ప్రబుద్దుడు. చివరికి ఎలాగో అలా వారి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరుకుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్షాయ్ ఘంజ్కు చెందిన బాధిత యువతికి.. అదే ప్రాంతానికి చెందిన నజీమ్తో వివాహమైంది. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం తేవాలని ఆమెను చిత్రహింసలు పెట్టాడు. నరకం చూపించాడు తాను చెప్పినట్టు చేయకపోవడంతో తలాక్ చెప్పాడు. తన నలుగురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితులు జుల్ఫికర్, జబ్బార్, సాజిమ్, అమీర్లతో కలిసి 15 రోజుల పాటు ఆమెకు నరకం చూపించాడు.
భర్త చెర నుంచి ఎలాగోలా బయటపడ్డ బాధితురాలు.. తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో ఆమె వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కనౌజ్ ఎస్పీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని వివరించారు. ఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో వెలుగుచూసింది. ఎప్పుడు వచ్చును మహిళకు స్వతంత్రం.. అది తెచ్చుట కదా మన కర్తవ్యం.. ఎప్పుడు వచ్చును స్త్రీ కి స్వేచ్ఛ అది ఇచ్చుట కదా సమాజం కర్తవ్యం.. గాంధీ కలలు కన్నా స్వరాజ్యం లో ఇంకా మహిళలపై దాడులు చేసే సమాజం నశించేది ఎన్నడూ నడి రాతిరి స్త్రీ దైర్యంగా, స్వేచ్ఛగా తిరిగేది ఎన్నడు..