కిరణ్ కుమార్ రెడ్డిపై వేటు వేస్తే

 

కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిన్న డిల్లీలో దీక్ష చేయడంతో ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం రేపు రాజ్యసభ ఎన్నికలు పూర్తవగానే, ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పించబోతోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవిభజన ప్రకటన చేసినప్పటి నుండి ఆయన ఏదో ఒక రూపంగా తన నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఆయన క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడని కాంగ్రెస్ పెద్దలే స్వయంగా కితాబులు ఇస్తూ వచ్చారు తప్ప ఏనాడు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత కేంద్రప్రభుత్వం పంపిన టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఆయన శాసనసభలో తీర్మానం చేయించినప్పుడు కూడా ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం లేదని చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు డిల్లీలో దీక్ష చేసినందుకు ఆయనను పదవిలో నుండి తొలగించాలనుకొంటే, అసలు ఆయన దీక్ష చేయకుండా ముందే ఎందుకు అడ్డుకోలేదనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.

 

కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆయన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో కలిసి డిల్లీలో నిరసన దీక్ష చెప్పట్టబోతున్నారనే సంగతి ఆయన అనుచరుల ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన దీక్ష చేసినట్లయితే అది తనకు తీరని అప్రదిష్ట కలిగిస్తుందని తెలిసి ఉన్నపటికీ, కాంగ్రెస్ ఆయనను అడ్డుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ వంటి తన విధేయులను కూడా వారించలేదు. వారించి ఉంటే దీక్షలో ముఖ్యమంత్రి ఒంటరివారయ్యే వారు. ఆయనే అవమానం పాలయ్యేవారు. కానీ కాంగ్రెస్ వారించలేదు. అందుకే అధిష్టానానికి విదేయులయిన కేంద్రమంత్రులు, యంపీలు, శాసన సభ్యులు, చివరికి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా అందరూ దీక్షలో కూర్చొన్నారు.

 

రాష్ట్ర విభజనపై మాట్లాడేందుకు కాంగ్రెస్ అధిష్టానమే వారికి స్వేచ్చ ప్రసాదించిందని ఇంతకాలం గొప్పగా చెప్పుకొన్నప్పుడు, ఇప్పుడు వారు దీక్ష చేసి నిరసన తెలియజేస్తే మాత్రం ఎందుకు ఆగ్రహించాలి? ముఖ్యమంత్రి నిరసన దీక్ష చేసి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, పార్టీకి అప్రదిష్ట కలిగించారని కాంగ్రెస్ అధిష్టానం భావించి ఆయనపై వేటు వేయదలచుకొంటే మరి పార్టీ పరువు కాపాడవలసిన పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణతో సహా దీక్షలో పాల్గొన్న సీమాంధ్ర నేతలందరిపై కూడా వేటు వేయవలసి ఉంటుంది. కానీ, వారందరినీ అడగకుండానే క్షమించేసి, కేవలం ముఖ్యమంత్రిపైనే వేటు వేస్తే, ఆయనని, కాంగ్రెస్ అధిష్టానాన్ని అనుమానించక తప్పదు.

 

పార్టీ తరపున నిలబడిన రాజ్యసభ సభ్యుల గెలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి అధిష్టానం పట్ల ఆయన విధేయతకు అద్దం పడుతోంది. అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఈ సాకుతో పదవిలో నుండి తప్పిస్తే, అది ఆయనకు శిక్షగా కాక సమైక్య చాంపియన్ గా ఎదిగేందుకు బహుమానం ఇస్తున్నట్లుంది. రాష్ట్ర సమైక్యత కొరకు తన అధిష్టానాన్నే ధిక్కరిస్తున్న కారణంగా ప్రజలలో జేజేలు అందుకొంటున్న కిరణ్ కుమార్ రెడ్డిని, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందక మునుపే పదవిలో నుండి తప్పించినట్లయితే, ఆయన బిల్లు ఆమోదం పొందేవరకు కూడా కేంద్రంపై తీవ్ర పోరాటం చేసి ప్రజలలో మరింత మంచి పేరు తెచ్చుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వెళితే దాని ఫలితం ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును. సీమాంధ్రలో కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి ఖాతాలోనే జమా అవ్వాలంటే, అందుకు ఇదే మంచి పద్ధతి.

Teluguone gnews banner

ఆ మూడు రాష్ట్రాలకూ కడుపు మంట ఎందుకు?

  ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ దేశంలోనే అతి పెద్ద పెట్టుబడి పెట్టేందకు ముందుకు రావడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు చాణక్యాన్నీ, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చూపుతున్న ప్రతిభ పట్ల ప్రపంచం మొత్తం అచ్చెరువోందుతోంది. అయితే  దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు మాత్రం కడుపుమంటతో గిలగిలలాడుతున్నాయి. వాటితో పాటు.. ఆంధ్రప్రదేశ్లో జనం ఇవ్వకపోయినా, విపక్ష హోదా కోసం నానాయాగీ చేస్తూ ప్రజాస్వామ్య దేవాలయం లాంటి అసెంబ్లీని కూడా బహిష్కరించి, ప్రెస్ మీట్లలో ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతున్న వైసీపీ కూడా గొంతు కలుపుతోంది.  ఇంతకీ ఆ మూడు రాష్ట్రాలూ ఏవంటే.. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం ఐటీ హబ్ గా గుర్తింపు పొందింది. కావలసినంత ప్రభుత్వ భూమి ఉంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అయినా కూడా ఏపీతో పోటీ పడటంలో వెనుకబడింది. దీనిపై రాష్ట్రంలో చిన్నసైజు రాజకీయ రచ్చ కూడా జరుగుతోంది.  ఇక బెంగళూరు విషయానికి వస్తే..  అక్కడ అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వం నిష్క్రియాపరత్వం కారణంగా ఉన్న కంపెనీలే పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. అలాంటి పరిశ్రమలకు ఏపీ ఆహ్వానం పలకడం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఈ పరిస్థితుల్లో గూగుల్ వంటి అగ్రసంస్థ భారీ పెట్టుబడితో ఏపీలో అడుగుపెట్టడంతో అనుచిత రాయతీలతో ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని శాపనార్ధాలు పెడుతోంది.  ఇక తమిళనాడు కడుపుమంట మరో టైపు. గూగుల్ సీఈవోగా తమ రాష్ట్రానికి చెందిన సుందర్ పిచాయ్ ఉన్నా కూడా ఆ సంస్థ అంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడానికి ఏపీని ఎన్నుకోవడమేంటంటూ అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను విపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతం సాధించారు, మీరేం చేస్తున్నారంటూ విశ్లేషకులు టీవీ టాక్ షోలలో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.  ఇంతకీ ఏపీ ఈ స్థాయిలో ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందంటే అందుకు ఇక్కడ ప్రభుత్వాధినేతకు రాష్ట్ర ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇంతకీ దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాల ఆగ్రహం, అసూయకు కారణమేంటయ్యా అంటే ఏపీ ప్రగతి ఆయా రాష్ట్రాలలో వారికి పొలిటికల్ గా నష్టం చేస్తుందన్న భయమేనంటున్నారు. 

ప్రచారం చేస్తారా.. ఫాం హౌస్ ప్రకటనలకే పరిమితమౌతారా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలోనైనా  ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చి ప్రచారం చేస్తారా? లేక  ప్రకటనలకే పరిమితమౌతారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆయన బహిరంగంగా సభలూ, సమావేశాలలో పాల్గొన్న సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. అంతకు ముందు నిత్యం ప్రజలతో మమేకమై ఉండే కేసీఆర్.. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత పూర్తిగాక్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏమైనా చెప్పదలచుకున్నా ఎంపిక చేసుకున్న నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడి పంపిస్తున్నారు.  ఇప్పుడు బీఆర్ఎస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అయినా ఆయన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వస్తారా లేదా అన్న అనుమానం రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తున్నది. బిఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ దాదాపుగా రాజకీయ అస్త్రసన్యాసం చేశారా అనిపించేలా ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు.  అధికారం కోల్పోయిన తరువాత పార్టీ రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది. స్వయంగా ఆయనే కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాల్సి వచ్చింది. పలు అవినీతి ఆరోపణలూ పార్టీ కీలకనేతలపై వచ్చాయి. చివరకు కన్న కూతురే పార్టీకి రాజీనామా చేసినా.. కేసీఆర్ మౌనం వీడలేదు. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టలేదు.  ఇక జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను కూడా ఫామ్ హౌస్ కు పిలిపించుకుని అక్కడే పార్టీ బీఫామ్ అందజేశారు. దీంతో ఇప్పుడు   కేసీఆర్ ఈ ఉప ఎన్నికల కోసం ప్రజా క్షేత్రంలోకి వస్తారా? పార్టీ గెలుపు కోసం మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తారా?  అంటే  బీఆర్ఎస్ శ్రేణులే  నమ్మకంగా ఔనని సమాధానం చేప్పలేకపోతున్నారు.   అయితే కేసీఆర్ తరువాత పార్టీ   బాధ్యతలు మోయడానికి సిద్దమైన కేటీఆర్ ఈ ఉపఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ విజయం ఆయనకు, ఆయన నాయకత్వ సమర్థతకు లిట్మస్ టెస్ట్ లాంటిదని చెప్పవచ్చు. అందుకే  జరుగుతున్నది ఉప ఎన్నికే అయినా ఇది రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ఠతకు,  కేటీఆర్  నాయకత్వ పటిమకు పరీక్ష అనడంలో సందేహం లేదు.  అందుకోసమైనా, కేటీఆర్ ను పార్టీలో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టడానికైనా కేసీఆర్ జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పార్టీ కేడర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. కేసీఆర్ కనుక ఒక సారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి తన గళం వినిపిస్తే.. ఇప్పటిదాకా పార్టీని చుట్టుముట్టిన సమస్యలన్నీ దూదిపింజెల్లా తేలిపోతాయని క్యాడర్ నమ్ముతోంది.  పరిశీలకులు సైతం అదే అంటున్నారు.  అయితే కేసీఆర్ ఇప్పుడు కూడా పామ్ హౌస్ కే పరిమితమై అజ్ణాతవాసాన్ని కొనసాగిస్తే మాత్రం ముందుముందు బీఆర్ఎస్ రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ ఇప్పుడైనా క్రియాశీలంగా మారి.. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేయకుంటే... సపోజ్ ఫర్ సపోజ్ ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్ కు అనుకూలంగా రాకపోతే.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ, ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది.  అందుకే బీఆర్ఎస్ నీటమునిగినా, పాలమునిగినా అందుకు కారణం కేసీఆర్ అవుతారని అంటున్నారు.  

కొంచమైనా లాజిక్ చూసుకోండయ్యా బాబూ..!

రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు సహజం. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీపై అధికారంలో లేని పార్టీ, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా విమర్శలు చేస్తుంటుంది. ప్రభుత్వ విధానాలను ఎండగడుంటుంది. అందులో తప్పుపట్టాల్సిన అవసరం ఇసుమంతైనా లేదు. అయితే ఏ విమర్శలోనైనా, విమర్శకైనా హేతువు అన్నది ఉండాలి.  అలా హేతురహితంగా చేసే విమర్శల వల్ల ప్రయోజనం సంగతి అటుంచితే రివర్స్ లో నవ్వుల పాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ చేస్తున్న విమర్శలు, వ్యవహరిస్తున్న తీరు అలాగే నవ్వుల పాలౌతోంది.  ఏ రాజకీయ పార్టీకైనా ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఒక విధానం అంటూ ఉంటుంది. ఆ సిద్ధాంతానికీ, విధానానికీ కట్టుబడి ఉన్న పార్టీ చేసే విమర్శలకు ఒకింత విలువ ఉంటుంది. ఆ పార్టీ చేసే విమర్శల్లో లాజిక్ ఉంటే జనం కూడా మద్దతు ఇస్తారు. అలా కాకుండా.. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాం,  ప్రతి అంశాన్నీ రాజకీయం చేసి లబ్ధిని వెతుక్కుంటాం అంటూ జనం నవ్వి పోతారు. పట్టించుకోవడం మానేస్తారు.  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అదే పరిస్థితి ఎదురౌతోంది.  విశాఖ‌ప‌ట్నానికి ప్ర‌తిష్టాత్మ‌క‌ గూగుల్ డేటా సెంట‌ర్, ఏఐ హ‌బ్ రావ‌డం పట్ల రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలూ, మేధావులు, వ్యాపార వాణిజ్య వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.   80 వేల కోట్ల‌కు పైగా పెట్టుబ‌డితో గూగుల్.. ఈ డేటా సెంట‌ర్‌, ఏఐ హ‌బ్‌ల‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుండటం దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ ఏపీపై పడేలా చేసింది. తెలుగుదేశం కూటమి సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన 18 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఏపీ ప్రతిష్ట, ఏపీ సీఎం ప్రతిష్ట ఒక్కసారిగా ఆకాశం ఎత్తుకు పెరిగాయి.    పైగా విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఏఐహబ్  ఏర్పాటుల గురించి కేంద్రం స్వయంగా హస్తినలో  ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి ఈ భారీ పెట్టుబ‌డుల గురించి దేశానికి తెలియ‌జేసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంపై సంతకాల సందర్భంగా కేంద్ర మంత్రులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.    మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి భారీ పెట్టుబ‌డులు వ‌చ్చిన‌పుడు ప్ర‌తిప‌క్షాలు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తాయి. ఏపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అంటూ లేకపోయినా, ప్రత్యర్థి పక్షంగా ఉన్నవైసీపీ ప్రశంసించలేదు సరికదా, ఈ విషయంపై రాజకీయం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది.  మొదట గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏముందంటూ పెదవి విరిచింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చేది కేవలం ఓ రెండు వందల ఉద్యోగాలు మాత్రమేననీ, డేటా సెంట‌ర్ల‌కు నీళ్లు భారీగా అవ‌స‌రం ప‌డ‌తాయ‌ని.. దీని వ‌ల్ల వైజాగ్‌లో నీటి స‌మ‌స్య త‌లెత్తుతుంద‌ని.. విద్యుత్ వినియోగం పెరిగి జ‌నం మీద భారం ప‌డుతుంద‌ని.. ఇలా తెలుగుదేశం కూటమి సర్కార్ సాధించిన ఈ  బ్రహ్మాండమైన  ఎఛీవ్ మెంట్ ను తక్కువ చేసి చూపడానికి వేయగలిగినన్ని కుప్పిగంతులు వేసింది.  సరే వైసీపీ విమర్శలకు తెలుగుదేశం కూటమి పార్టీలు దీటుగానే బదులిచ్చాయి. అది వేరే విషయం. అయితే అదే వైసీపీ గూగుల్ డేటాసెంటర్, ఏఐహబ్ వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించడంతో ఊరుకోలేదు.. అదే సమయంలో రాష్ట్రానికి గూగుల్ రావడంలో క్రెడిట్ అంతా జగన్ దే అంటోంది. ఒకే సమయంలో రెండు రకాలుగా వైసీపీ మాట్లాడుతోంది.  జ‌గ‌న్ హ‌యాంలో అదాని వైజాగ్‌లో డేటా సెంట‌ర్ పెట్ట‌డానికి ముందుకు వ‌చ్చారనీ, ఇప్పుడు గూగుల్‌తో అదానీ అసోసియేట్ అవుతున్నాడు కాబ‌ట్టి ఈ భారీ పెట్టుబ‌డి తాలూకు క్రెడిట్ కూడా జ‌గ‌న్‌దే వైసీపీ నేతలు సొంత డప్పు వాయించుకుంటున్నారు. ఓవైపు డేటా సెంట‌ర్ల‌తో ప్ర‌యోజ‌నం లేద‌ని, అంతా నాశ‌నం అని విమర్శిస్తూనే.. ఈ క్రెడిట్‌ను జ‌గ‌న్‌కు క‌ట్టబెట్ట‌డానికి తాప‌త్ర‌య ప‌డ‌డం వైసీపీని నవ్వుల పాలు చేస్తున్నది. హేతుబద్ధత లేకుండా విమర్శలు చేయడం, మళ్లీ అదే సమయంలో అధికార పార్టీ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసేసుకోవడానికి తాపత్రేయ పడటం వైపీపీ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. 

ఆనవసర ఆపరేషన్లతో నిలువుదోపిడీ.. దేశంలో వైద్య విలువలు పతనం?

దేశంలో చికిత్స, వైద్యం పేరున అంతులేని దోపిడీ జరుగుతోంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీయే అంగీకరించింది. దేశంలో ఆరోగ్య రంగం పతనం అంచున ఉందని నివేదికలు చెబుతున్నాయి. విషయమేంటంటే దేశంలో జరుగుతున్న ఆపరేషన్లలో 44శాతం వరకూ నకిలీవేనని ఒక వార్తా సంస్థ నివేదిక కుండబద్దలు కొట్టింది. అంటే అవసరం లేని, మోసపూరితంగా ఆపరేషన్ల పేర ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని వెల్లడించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఆరోగ్యం విషయంలో ప్రజలలో ఉన్న భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయన్న మాట.  ఆ వార్తా సంస్థ నివేదిక ప్రకారం దేశంలో గుండె ఆపరేషన్లు అంటూ చేస్తున్న శస్త్రచికిత్సల్లో 55 శాతం అవసరంలేనివే. అలాగే గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు, మోకాలి మార్పిడి ఆపరేషన్లు, ఇక క్యాన్సర్ ఆపరేషన్లలో కూడా దాదాపు సగం అనవసరమైనవేనని నివేదిక వెల్లడించింది. అలాగే నార్మల్ డెలివరీ అయ్యే కేసులలో కూడా   కానుపు కష్టమౌతుందంటూ ఆస్పత్రులు సిజేరియన్లే చేస్తున్నారని ఆ వార్త సంస్థ నివేదికలో తేలింది. దేశంలో జరిగే సిజేరియన్ ఆస్పత్రులలో 45 శాతానికి పైగా అనవసరమైనవేనని పేర్కొంది.   ఇలా అనవసరమైన ఆపరేషన్లు, లేదా నకిలీ ఆపరేషన్లు చేయడానికి ఆస్పత్రులు వైద్యులకు నెలకు కోటి రూపాయల వరకూ వేతనాలిచ్చినియమించుకుంటున్నాయని పేర్కొంది. మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలోని  ప్రముఖ ఆస్పత్రులలో ఈ వార్తా సంస్థ సర్వే నిర్వహించి మరీ ఈ వివరాలను వెల్లడించింది.   ఇంకా దారుణమైన విషయమేంటంటే.. తమ ఆస్పత్రులలో పని చేస్తున్న వైద్యులలో ఎవరు ఎక్కువ మెడికల్ టెస్టులు చేయిస్తారో, ఔట్ పేషెంట్లుగా వచ్చిన వారిలో ఎక్కవ మందిని ఇన్ పేషెంట్లుగా చర్చుతారో, అలాగే ఎవరు  అవసరం, అనవసరంతో సంబంధం లేకుండా అధిక ఆపరేషన్లు చేస్తారో వారికి వేతనాల పెంపు, బోనస్ లు దక్కుతున్నాయని కూడా సర్వే తేల్చింది.   అంతే కాకుండా ఠాకూర్ సినిమాలో చూపించిన విధంగా రోగి మరణించిన తరువాత కూడా అతని పరిస్థితి విషమంగా ఉందంటూ చికిత్స చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయని ఆ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది.   ఈ రకంగా దేశంలో జరుగుతున్న వైద్య మోసాలను పార్లమెంటరీ కమిటీ కూడా ధృవీకరించింది. మోసాలు బయటపడిన సందర్భాలలో ఆయా ఆస్పత్రులకు జరిమానాలు విధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే మోసం ద్వారా వచ్చే ఆదాయంతో పొలిస్తే జరిమానాలు చాలా చాలా తక్కువగా ఉండటంతో ఆస్పత్రులు మోసం బయటపడినప్పుడు జరిమానా చెల్లించి చేతులు దులిపేసుకుని తమ దందాను మళ్లీ యథా ప్రకారం కొనసాగిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

కూటమి పాల‌న‌లో ప‌వ‌న్ పేజీలు కొన్ని మిస్సింగ్?

మాములుగా ప్ర‌తి ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ఇటు సీఎం చంద్ర‌బాబుతో పాటు, అటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫోటోలు కూడా పెడుతుంటారు. అంటే ముఖ్య‌మంత్రే కాక, ఉప ముఖ్య‌మంత్రి కి కూడా ప్ర‌భుత్వంలో విలువ ఉంద‌ని చెప్ప‌డానికిదో నిద‌ర్శ‌నం అన్న‌మాట‌. అలాంటిది కొన్ని ప్ర‌భుత్వ  కార్య‌క‌లాపాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు క‌నిపించ‌రు? తాజాగా సీఆర్డీఏ భ‌వ‌న ప్రారంభోత్స‌వ‌మే తీసుకుందాం. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ ఎందుకు దూరంగా ఉన్నారు? అన్న‌దిపుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇదేమంత చిన్న విష‌యం కాదు. ఎందుకంటే ఇక్క‌డి నుంచే అమ‌రావ‌తి ద‌శ- దిశ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ అమ‌రావ‌తి అంటే నీట మునిగే న‌గ‌రం అన్న వైసీపీ ట్రోలింగులు చూసే ఉంటాం. దీన్ని క్వాంటం వాలీ అన‌డం క‌న్నా ఆక్వా వాలీ అనొచ్చు, ఆపై పుల‌స కూడా ఇక్క‌డ దొరికే చాన్సుందన్న వ్యంగ్యాస్త్రాల సంగ‌తి స‌రే స‌రి. ఈ క్ర‌మంలో ఇక్క‌డొక పాల‌నా భ‌వ‌నం ప్రారంభం కావ‌డం అన్న‌ది అమ‌రావ‌తి అభివృద్ధికే ఒక దిక్సూచిలాంటిది. అలాంటి భ‌వ‌న ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ మాత్ర‌మే కాదు.. కూట‌మిలో మ‌రో పార్టీ అయిన బీజేపీ సైతం అస్స‌లు రాలేదు. వీరికి ఆహ్వానం లేదా? లేక వారే లైట్ తీస్కున్నారా? అన్నది తెలీడం లేదు. అదేమంటే స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత ఫోటో ఒక‌టి ప‌ట్టుకుని యువ‌త ఉచితాలు అడ‌గ‌టం లేద‌ని.. వారి ప్ర‌తిభా పాట‌వాలు వెలికి తీయాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్న కోణంలో ఒక ట్వీట్ చేయ‌డంతో ఇప్పుడ‌ది వైర‌ల్ అయ్యింది.  మ‌రి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డానికి ఇన్నేసి ఉచిత హామీలు ఎందుకిచ్చిన‌ట్టు?   తానే స్వ‌యంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేసి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తామ‌న్నారు? దాని సంగ‌తేంటి? అన్న చ‌ర్చ‌కు తెర‌లేపారు ప‌వ‌న్.  వైర‌ల్ ఫీవ‌ర్ ఇంకా ఉంద‌ని హైద‌రాబాద్ లో ప‌డి ఉండ‌క‌, ఈ వైర‌ల్ కంటెంట్ రైజ్ చేయ‌డం దేనికీ? అన్న‌ది కూట‌మిలోని ప్ర‌ధాన పార్టీకి చెందిన టీడీపీ నాయ‌కులు అంటోన్న మాట‌. దానికి తోడు  కూట‌మికే బీట‌లు వారేలాంటి వినుత కోట‌- సుధీర్ రెడ్డి వ్య‌వహారం ఒక‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప‌ట్టి పీడిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ కోణంలోగానీ ఆయ‌న సీఆర్డీఏ భ‌వ‌న ప్రారంభోత్స‌వానికి రాలేద‌నుకోవాలా? ఒక వేళ ప‌వ‌న్ గానీ ఈ సెర్మ‌నీకి వ‌చ్చి ఉంటే, జన సైనికులు ప‌లు ర‌కాల కామెంట్లకు తెర‌లేపుతార‌న్న భ‌యం కొద్దీ ఈ కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నార‌నుకోవాలా!? అది స‌రే.. ప‌వ‌న్ కంటే ఇటు ప‌ర్స‌న‌ల్ ప్రాబ్ల‌మ్స్ అటు పార్టీ ప్రాబ్ల‌మ్స్ చాలానే. మ‌రి బీజేపీ ఎందుకు మిస్ అయిన‌ట్టు? అస‌లు కూట‌మిలో ఈ మూడు పార్టీల సంబంధాలూ స‌వ్యంగానే ఉంటున్నాయా?  వీరి మ‌ధ్య పొర‌ప‌చ్చాలేం లేవు క‌దా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. మిథున్ రెడ్డి విష‌యంలో బీజేపీ చూపిస్తున్న సానుకూల వైఖ‌రి కార‌ణంగా  ఈ ఎడబాటు ఏర్ప‌డిందా? కూట‌మి పార్టీల్లో అస‌లేం జ‌రుగుతోంది? అన్న వాడి వేడి చ‌ర్చ‌కు తెర‌లేచింది.

జూబ్లీ బైపోల్.. కనిపించని సానుభూతి ఫ్యాక్టర్!?

తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్ ను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే  మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక కోసం నోటిషికేషన్ విడుదలైంది. వచ్చే నెల11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితంవెలువడుతుంది. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించి.. గ్రేటర్ పై తమ పట్టు సడలలేదని నిరూపించుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉండగా, తమ ప్రభుత్వ పనితీరుకు ప్రజామోదం ఉందని రుజువు చేసుకోవడానికి ఈ ఉప ఎన్నిక ను అధికార కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. అంతర్గత విభేదాలు, ఆశావహుల అలకల ద్వారా ఎదురైన ఇబ్బందులకు అధిగమించి, అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకు పోవడానికి రెడీ అయ్యింది. ఇక బీజేపీ కూడా జూబ్లీ బైపోల్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పట్ల జనం విసిగిపోయి ఉన్నారనీ, ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ వైపు చూస్తున్నారనీ చెప్పుకుంటున్న కమలం పార్టీ జూబ్లీ బైపోల్ లో విజయం ద్వారా 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలన్న కలను సాకారం చేసుకోవడానికి పునాది వేసుకోవాలని భావిస్తున్నది. అయితే  తెలంగాణబీజేపీలో కూడా అంతర్గత విభేదాలు, రాష్ట్ర నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం తదితర సమస్యలు ఉన్నాయి. ఆ కారణంగానే నోటిఫికేషన్ విడుదల అయినప్పటికీ ఆ పార్టీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. మరో వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో అధిష్ఠానం తెలంగాణ అభ్యర్థి ఎంపిక విషయంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. దీంతో విలువైన ప్రచార సమయాన్ని బీజేపీ కోల్పోతోంది.  ఇవన్నీ అలా ఉంచితే.. పరిశీలకులు మాత్రం ఈ ఉప ఎన్నికలో సానుభూతి ఫ్యాక్టర్ ప్రభావం ఇసుమంతైనా కనిపించడం లేదని అంటున్నారు. బీఆర్ఎస్ సానుభూతి ఫ్యాక్టర్ ను నమ్ముకుని పార్టీ టికెట్ ను దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సుజాతకు ఇచ్చింది. అన్ని పార్టీల కంటే ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో ఆ పార్టీ ఇప్పటికే ప్రచారం ప్రారంభించేసింది. అయితే.. సానుభూతి ఫ్యాక్టర్ అన్నది కనిపించకపోవడంతో... బీఆర్ఎస్ ఆశలన్నీ రేవంత్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది.  చూడాలి మరి బీఆర్ఎస్ సానుభూతి ఆశలు ఏ మేరకు ఫలిస్తాయో? 

తుస్సు మంటున్న వైసీపీ ఆందోళనలు.. తెలుగుదేశంకూ తప్పని తలపోట్లు!

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెంచడానికి వైసీపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. నాన్ ఇష్యూస్ ను సైతం తీసుకుని ఆందోళనలకు పిలుపునిస్తోంది. అయితే వైసీపీ వాదనలు, ఆందోళనలను ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అదే సమయంలో  అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలకూ పెద్దగా స్పందన కానరావడం లేదు.  ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజా సేవలు, శాఖా సమీక్షలు, పింఛన్ పంపిణీల, ఇతర పథకాల అమలు ద్వారా ప్రజలకే చేరువకావడానికి ప్రయత్నం చేస్తుంటే.. వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మొత్తం వ్యవహారం అంతా 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావడంగా పరిశీలకులు చెబుతున్నారు.  అధికార  తెలుగుదేశం సంక్షేమ, అభివృద్ధి నినాదంతో జనానికి చేరువకావడానికి ప్రయత్నిస్తుండగా, వైసీపీ ప్రజాహక్కులు అన్న నినాదంతో ప్రజలలోకి వెళ్లాలని చూస్తున్నది.    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి 'పేదల సేవలో ప్రజా వేదిక' పేరిట ప్రతినెలా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదల మద్దతును పొందగలుగుతున్నారు. అదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఒకింత మసకబారుతున్న పరిస్థితీ కనిపిస్తోంది.     ఇక వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అంటూ చేపట్టిన ఆందోళన పెద్దగా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన నర్సీపట్నం పర్యటనకు జనం మొహం చాటయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చునని పరిశీలకులు అంటున్నారు.  తన పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలు  పేదలకు వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందించడానికి ఉద్దేశించినవనీ, చంద్రబాబు సర్కార్ వాటిని ప్రైవేటు పరం చేస్తున్నదని జగన్ చేస్తున్న ప్రచారానికి, ఆందోళనకు ప్రజామద్దతు పెద్దగా లభిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే కాలేజీల ప్రకటన వినా అవి పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పాలి.  అయినా కూడా వైసీపీ అక్టోబర్ 10 (శుక్రవారం) నుంచి వచ్చే నెల 22 వరకూ రచ్చబండ, అక్టోబర్ 28న నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, 12న జిల్లాస్తాయి ర్యాలీలు అంటూ ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు మెమోరాండం సమర్పించాలని సంకల్పించింది. అయితే ఈ కార్యక్రమాలకు పిలుపునిచ్చి.. వైసీసీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు చెక్కేయడంతో వీటికి సీరియస్ నెస్ లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అననిటికీ మించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పీపీపీ విధానానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, మెడికల్ పాలేజీల పీపీపీ విధానానినికి టెండర్ల ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించడం అధికార పార్టీకి కలిసి వచ్చినట్లైంది.   మొత్తంగా రాష్ట్రంలోని పరిస్థితి ప్రతిపక్షానికి ఇసుమంతైనా అనుకూలంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తున్న వ్యతిరేకత, ఆరోపణల కారణంగా ప్రభుత్వం పట్ల కూడా పెద్దగా సానుకూలత లేదని పరిశీలకులు అంటున్నారు. 

నోబెల్ కోసం ట్రంప్ ‘కల’ వరం

నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రకటనకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పటికే, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం రేసులో ముందంజలో ఉన్నారు.  నోబెల్ శాంతి పురస్కారం ప్రకటనకు ప్రైజ్ ప్రకటనకు ఒక్క రోజు ముందు.. దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా ఘర్షణలో.. కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  నిజంగానే ట్రంప్‌ని నోబెల్ శాంతి పురస్కారం వరిస్తుందా? అన్న చర్చ మొదలైంది. నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ ను వరిస్తుందా? అన్న ఆశక్తి ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమౌతోంది.  కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఈ పురస్కారం దక్కించుకోవాలని ఆయన కలకంటున్నారు. దక్కదేమో అని కలవర పడుతున్నారు. ఏకంగా ఐక్యరాజ్యసమితి వేదికగానే.. తాను ఏడు యుద్ధాలు ఆపి,  శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ఆయనంతట ఆయనే ప్రకటించేసుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశాన్న ఆయన స్వోత్కర్ష  అప్పట్లో వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌‌గా మారింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు  షేర్ చేస్తూ వచ్చిన ట్రంప్. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. భారత్ నిర్ద్వంద్వంగా ట్రంప్ వ్యాఖ్యలను ఖండించినా పట్టించుకోలేదు. పదే పదే అదే మాట చెబుతూ వస్తున్నారు.  ఇలా కొన్నాళ్లుగా నోబెల్ శాంతి పురస్కారం కోసం కోసం ట్రంప్  ఆరాటపడుతున్నారు. తనను తానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నోబెల్ పురస్కార ప్రకటనకు ఒక్క రోజు ముందు..  దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్-గాజా వివాదంలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని తాను కుదిర్చినట్లు ప్రకటించుకున్నారు.  దీనికి తోడు వైట్ హౌజ్ ఆయనని  ద పీస్ ప్రెసిడెంట్  అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది.  దీంతో ట్రంప్ నోబెల్ పురస్కారం అందుకోవాలన్న పిచ్చి పీక్స్ కు చేరిందంటూ నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే వైట్ హౌస్ ఆయనను పీస్ ప్రెసిడెంట్ గా అభివర్ణించడం ట్రంప్ పీస్ రేసుకి  ఊతమిచ్చినట్లయిందని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద నిజంగానే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశం ఉందా?  వైట్ హౌజ్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాజాలో యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్‌, హమాస్‌ తొలి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించినట్లు ట్రంప్‌ తెలిపారు.  ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకం చేశాయని తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్ట్ చేశారు.  గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు  ఇదొక అపూర్వ అడుగుగా ట్రంప్‌ అభివర్ణించారు.  నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించడానికి ఒక్క రోజు ముందు ఈ ఒప్పందం కుదిరింది. 79 ఏళ్ల ట్రంప్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం ఇది. ఇలాంటి క్షణంలో  వైట్ హౌజ్ చాలా తెలివిగా పీస్ ప్రెసిడెంట్ అంటూ  ట్వీట్ చేసింది. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు,  ఓ మార్గాన్ని కనుగొంటుందనీ,  వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చేయని వ్యక్తికే  ఈ పురస్కారం ఇస్తారనీ అనడం చర్చనీయాంశంగా మారింది.  అంతేకాదు  తాము రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పుకుంటున్నారు. చరిత్రలో ఎవరూ కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించదంటూ తన భుజాలను తానే చరిచేసుకుంటున్నారు ట్రంప్.  అంతే కాదు.. తనకు నోబెల్ పురస్కారం దక్కకపోతే అది అమెరికాకే పెద్ద అవమానం అవుతుందంటున్నారు ట్రంప్.  అమెరికాకే  నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని  వర్జీనియాలో జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు.  మొత్తానికి.. ప్రెసిడెంట్  ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారం కోసం  చాలాచాలా పెద్ద ప్రయత్నాలే చేస్తున్నారు. తనను తాను యుద్ధాలను ఆపిన శాంతి దూతగా ప్రమోట్ చేసుకోవడమే కాకుండా, నోబెల్ కమిటీని బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు.   నిజం చెప్పాలంటే.. ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధాల్లో జోక్యం చేసుకోవడం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించడం లాంటివన్నీ,  నోబెల్ కోసమే చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తోంది.  దానికితోడు రిపబ్లికన్ నేతలు, అనేకమంది ప్రపంచ నాయకులు ట్రంప్‌ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు.  ఇప్పుడు కూడా రెండేళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడంతో ట్రంప్‌కు  మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కసరత్తు అంతా నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకేననే చర్చ జరుగుతోంది.

జగన్ మెడికల్ రాజకీయం.. సెల్ఫ్ గోల్ అవుతుందా?

 ఫ్యాన్ పార్టీ మరో తప్పటడుగు వేస్తోందా ? తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి  పెట్టాలన్న తొందరలో అనాలోచితంగా వ్యవహరించి సెల్ఫ్ గోల్ చేసుకోబోతోందా?   అంటే అనకాపల్లి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా  ప్రజలు అవుననే అంటున్నారు.  ఎప్పుడైనా నాయకుడు పూర్తి చేసిన భవనం, పథకం గురించి పర్యటించి గొప్పగా చెప్పుకుంటారు గాని, అందుకు  భిన్నంగా అసంపూర్ణంగా ఉన్న మెడికల్ కాలేజ్ భవనం చూపించి జగన్ ఏం చేయాలని అనుకుంటున్నారన్న ప్రశ్నకు ఆయన   కేవలం రాజకీయం మాత్రమే చేయబోతున్నారనీ, ఇది ఒకరకంగా వైసీపీకి   సెల్ఫ్ గోల్ అవుతుందని ఫ్యాన్ పార్టీ నాయకులు కూడా మధనపడుతున్నారు  ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు ప్రతిపా దనలు చేశారు అందులో ప్రస్తుత అనకాపల్లి లో నిర్మాణానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు కానీ ఆ స్థలం వివాదం కావడంతో అనకాపల్లికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలోని మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద 52.15 ఎకరాల భూమిలో 20 22 డిసెంబర్ 28న జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 500 కోట్ల రూపాయలఅంచనాతో ఏడు అంతస్తులలో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయి. కానీ మూడు అంతస్తులకు మాత్రమే వేయడం జరిగింది . మిగిలిన నాలుగు ఐదు భవనాలకు పిల్లర్లు వేశారు. కాంట్రాక్టర్ నిర్మాణ పనులను ఎన్నికల ముందే నిలిపివేశారు. ఇప్పటి వరకు దాదాపు పాతిక కోట్ల రూపాయలను ఈ మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి వెచ్చించినట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్రం ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ నిర్మాణ ప్రతిపాదన చేసింది. కానీ నర్సీపట్నంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీకి సంబంధించి కేంద్రం అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు .  ఏపీలో ఏడు మెడికల్ కాలేజీలకు  దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు మచిలీపట్నం లో మెడికల్ కాలేజ్ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా నిర్మాణ పనులు పూర్తి చేపట్టాలని కొన్నిసార్లు ప్రభుత్వాలు భావిస్తాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ విషయంలో కూడా అదే రీతిన జగన్ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని భావించారు. అయితే తాజా కూటమి ప్రభుత్వం అసంపూర్ణంగా మిగిలిన మెడికల్ కాలేజీ లను పిపిపి పద్ధతిలో పూర్తి చేయాలని ప్రతిపాదన చేసింది. దీన్ని సహజంగానే ఫ్యాన్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పటికే  ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి  ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తయి విద్యార్థులు అడ్మిషన్ లు జరిగిన కాలేజీని కాక   అసంపూర్ణంగా ఉన్న నర్సీపట్నం కాలేజీని ఎంచుకోవడం కేవలం రాజకీయం కోసమే అని పరిశీలకులే కాదు,  కొందరు వైసిపి నాయకులు కూడా అంటున్నారు.  కేవలం స్పీకర్ అయ్యన్నపాత్రుడు నియోజవర్గంలో రాజకీయం చేసేందుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన  పెట్టుకున్నారనీ, దీని వల్ల సెల్ఫ్ గోల్ చేసుకోవడం వినా మరో ప్రయోజనం సిద్ధించదని చెబు తున్నారు.  

వెంక‌య్య చెప్పింది వేద‌మ‌య్యా.. కానీ! ?

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంక్షేమ ప‌థ‌కాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఆ ఖ‌ర్చు కూడా శృతి మించి పాకాన ప‌డుతోంది. ఈ విష‌యాన్నే ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు. ప్ర‌స్తుతం ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ఉచితాలు అనుచితంగా మారాయ‌ని వెంకయ్య అన్నారు.  ఈ మాట‌లు కూడా నిజ‌మే క‌దా  అనిపించ‌క మాన‌వు. ఏం ప‌థ‌కాల‌వి? జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కుడు పాల‌న‌ బామ్మ కూడా చేస్తుంద‌న్న బాబు.. ఇప్పుడేం చేస్తున్నార‌న్న‌ది కూడా ఒక చ‌ర్చ‌నీయాంశ‌మే. జ‌గ‌న్ ఏటా డెబ్భై వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చయ్యేలాంటి ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న చేస్తే, అదే చంద్ర‌బాబు అంత‌కు రెట్టింపు చేస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.  అలాగ‌ని ఇదంతా చంద్ర‌బాబుకు నచ్చి చేస్తున్న‌ది కాద‌న్న‌ది కూడా అంతే వాస్త‌వం. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో జ‌నాన్ని సంక్షేమ ప‌థ‌కాల ద్వారా మ‌భ్య పెట్ట‌డం ద్వారా మాత్ర‌మే రాణించ‌గ‌ల‌మ‌న్న‌ది తెలిసిందే.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇక్క‌డ జ‌గ‌న్ అయిన దానికీ కానిదానికీ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. ఆయ‌న ప‌థ‌క‌ ర‌చ‌న డీ కోడ్ చేయాలంటే అంత‌క‌న్నా మించిన ప‌థ‌క ర‌చ‌న చేస్తేనే సాధ్యం. జ‌గ‌న్ ప్ర‌వేశ పెట్టిన చాలా చాలా ప‌థ‌కాలు గ‌తంలో లోకేష్ ప్ర‌స్తావించిన‌వే. ఆ ప‌థ‌కాల‌ను బాబు తొలుత వ‌ద్ద‌న్నారు. కానీ, అదే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి ప‌రాజ‌యం కొని తెచ్చి పెట్టింది.  2024 ఎన్నిక‌ల‌ నాటికి చంద్రబాబు త‌న ప్లాన్ ఛేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌భుత్వ‌ సొమ్ము ప‌ప్పు బెల్లాల్లా పంచి పెట్ట‌డానికి ఏమంత స‌ముఖంగా లేరు. అందుకే పీ-4 వంటి ప‌థ‌కాల‌ను తీసుకొచ్చి ప్ర‌యివేటు వ్య‌క్తుల భాగ‌స్వామ్యం సంక్షేమంలో పెంపొందిస్తున్నారు.  ఇక మెడిక‌ల్ కాలేజీల్లో పీపీపీ ప‌థ‌కం కూడా స‌రిగ్గా ఇలాంటిదే.  ప్రైవేటు భాగ‌స్వామ్యం ఎలాంటి ఫ‌లితాలనిస్తుందో హైద‌రాబాద్- మెట్రోను బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీస్కోవ‌చ్చు. ఇప్పుడు హైద‌రాబాద్ మెట్రోను బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దిన ఎల్ అండ్ టీ చాలా చాలా త‌క్కువ ధ‌ర‌కు త‌మ వాటాల‌ను వ‌దులుకోడానికి సిద్ధ ప‌డుతోంది. దీని ద్వారా లాభ‌మేంటంటే ఈ మొత్తం  ప్ర‌భుత్వానికి ఒక ఆస్తిగా మ‌రుతున్నది. భ‌విష్య‌త్ లో న‌గ‌రానికే ఇదొక మ‌ణిహారంగా మారుతుంది.  కానీ విధిలేని ప‌రిస్థితుల్లో బాబు ఆయా ప‌థ‌కాల‌ను ఇస్తుండ‌టం ఒక రాజ‌కీయ అనివార్య ప‌రిస్థితిలో భాగంగానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది. పోటా పోటీ రాజ‌కీయాల కార‌ణంగానే ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను ఇస్తోంది. రీసెంట్ గా ఇచ్చిన ఆటో డ్రైవ‌ర్ల సేవ ఇంచు మించు అలాంటిదే. ఉచిత బ‌స్సు ప‌థ‌కం  ఆటో డ్రైవ‌ర్లకు ఇబ్బందిక‌రంగా మారింది.  దీంతో ఆటో డ్రైవ‌ర్ల‌కు 15 వేల రూపాయ‌లను విధిలేని ప‌రిస్థితుల్లో ఇవ్వాల్సి వ‌చ్చింది.  వాజ్ పేయి అన్న‌ట్టు విద్యా, వైద్యం త‌ప్ప మ‌రేదీ ఉచితంగా అందివ్వాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ప్ర‌స్తుతం ఇటు ఏపీలో కావ‌చ్చు, అటు తెలంగాణ‌లో కావ‌చ్చు ఉన్న రాజ‌కీయ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. వ్య‌వసాయ ఆధారిత రాష్ట్రాలు కావ‌డంతో.. ఇక్క‌డ సంక్షేమానికి పెద్ద పీట వేయ‌క త‌ప్ప‌దు.  దానికి తోడు రాజ‌కీయాల్లోకి ఈ వ్యూహకర్తల రాకడ వ‌ల్ల‌ కూడా.. ఈ పోటా పోటీ సంక్షేమ ప‌థ‌కాలు తెలుగు రాజ‌కీయాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో వ‌ర్క‌వుట్ అయిన ప‌థ‌కాల‌ను గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్ర‌క‌టించ‌డంతో.. అప్ప‌టి వ‌ర‌కూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తూ వ‌చ్చిన ప‌థ‌కాలు కాస్తా గాలికెగిరిపోయాయి. మ‌హిళ‌లంతా క‌ల‌సి త‌మ కోసం కాంగ్రెస్ ప్ర‌క‌టించిన.. రూ. 500కే గ్యాస్ సిలిండ‌ర్, ఉచిత విద్యుత్, స‌న్న‌బియ్యం.. అన్నిటిక‌న్నా మించి ఫ్రీ బ‌స్ కి జై కొట్టారు.  దీంతో కాంగ్రెస్ ఇక్క‌డ అనూహ్యంగా మూడో స్థానం నుంచి దూసుకొచ్చి ఫ‌స్ట్ ప్లేస్ ఆక్ర‌మించింది. అధికారం కైవ‌సం చేసుకుంది.  ఇది గుర్తించిన తెలుగుదేవం కూట‌మి ఇవే సంక్షేమాల‌ను అటు ఇటుగా మార్చి.. సూప‌ర్ సిక్స్ అన్న నామ‌క‌ర‌ణం చేసి వ‌ద‌ల‌డంతో.. ఇక్క‌డ జ‌గ‌న్ సంక్షేమ జాత‌ర‌కు ఒక్క‌సారిగా ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్ట‌య్యింది. దీంతో ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువైంది.  ఉచితం అన్న‌ది రాజ‌కీయ క్రీడ‌లో ఒక‌ భాగ‌మై పోయింది. మేము ఎలాంటి సంక్షేమ ప‌థ‌కాలూ ఇవ్వం అని చెప్పి ఇక్క‌డ రాజ‌కీయాలు చేయ‌డానికి వీల్లేని ప‌రిస్థితి. ప్ర‌స్తుతం వెంక‌య్య నాయుడు మాత్ర‌మే కాదు గ‌తంలో జేపీ న‌డ్డా ఏపీ వ‌చ్చిన‌పుడు కూడా ఈ సంక్షేమాలు త‌మ అభిమ‌తం కాద‌న్నారు. కానీ ఏపీలోని రాజకీయాల‌పై సంక్షేమం ఎంత‌టి ప‌వ‌ర్ఫుల్ అంటే, సోము వీర్రాజును కాస్తా సారాయి వీర్రాజుగా మార్చేంత‌. ఆయ‌న కూడా ఉచితాల ప్ర‌క‌ట‌న‌లో భాగంగా ఆనాడు.. అత్యంత చౌక‌గా మ‌ద్యం అందుబాటులోకి తెస్తామ‌ని ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింది. ఇక్క‌డ అలాంటి కాంట్ బ‌ట్ సిట్యువేష‌న్ రాజ్య‌మేలేతున్న విధం కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌ల్సి ఉంది.   పొలిటిక‌ల్ గా ఇలాంటి ప్రాక్టిక‌ల్ ప్రాబ్ల‌మ్స్ చాలానే ఉన్నాయి. దీంతో సంక్షేమాలు ఒక అనివార్యంగా త‌యార‌య్యాయి. అభివృద్ధి మాత్ర‌మే చేస్తామ‌ని తెలుగు రాజ‌కీయాల్లో నెట్టుకు రావ‌డం చాలా చాలా క‌ష్టం అన్న‌ది ఇక్క‌డ ఏ  క్రియాశీల రాజ‌కీయ నాయ‌కుడ్ని అడిగినా చెబుతారు.