అసెంబ్లీ లో హరీష్ రావు పాట..
posted on Mar 18, 2021 @ 3:08PM
చూడు చూడు నల్లగొండ... గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ అంటూ నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసిన పాటని మంత్రి హరీష్ రావు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఈ పాట పాడారు.
నల్లగొండలో ప్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ప్లోరోసిస్ బారిన పడడంలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించిందని హరీశ్ రావు అన్నారు. మిషన్ భగీరథ పథకం నల్గగొండ ప్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే.. మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదని. ఆదిలాబాద్ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తాగి డయేరియా కారణంగా మరణించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదేళ్లలోనే తాగునీటి కష్టాలు తీర్చారని . ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, మిషన్ భగీరథ పధకం ద్వారా రాష్ట్రంలోని అన్ని అవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత నీరు ఇంటింటింకి నల్లాల ద్వారా అందుతున్నాయని హరీశ్ రావు తెలిపారు.