అంతరిక్షంలోకి తెలుగు ‘తోటకూర’

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి తెలుగువాడిగా గోపీచంద్ తోటకూర ఘనత సాధించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్’కి చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది. మన గోపీచంద్ తోటకూరతో సహా మొత్తం ఆరుగురు ప్రయాణికులతో కూడిన న్యూ షెప్పర్డ్ 25 (NS 25) అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. అంతరిక్షంలోకి చేరుకున్న వీరందరూ కొద్దిసేపు భారరహిత స్థితికి చేరుకున్నారు. ఆ తర్వాత కాప్స్యూల్‌లో తిరిగి విజయవంతంగా భూమికి చేరుకున్నారు. దీనితో రోదసీలోకి వెళ్ళి వచ్చిన తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర చరిత్ర లిఖించారు.

భారత మూలాలున్న అమెరికా పౌరులు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాచా చారి, శిరీష బండ్ల అంతరిక్ష యానం చేశారు. గోపీచంద్ తోటకూర అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆయన భారత పౌరుడు. పైగా మన తెలుగువాడు.

Teluguone gnews banner