తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on May 20, 2024 @ 9:33AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (మే 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిడిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనారికి 16 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక ఆదివారం (మే 19) శ్రీవారికి మొత్తం 86 వేల 721 మంది దర్శించుకున్నారు.
వారిలో 39 వేల 559 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక హుండీ కానుకల ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చింది.