కృష్ణాష్టమి వేడుకల్లో దారుణం..కళాకారిణిపై గ్యాంగ్రేప్
posted on Aug 29, 2016 @ 10:54AM
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అయితే అనంతపురం జిల్లాలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో దారుణం జరిగింది. వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చిన ఓ కళాకారిణిపై సామూహిక అత్యాచారం జరిగింది. నార్పలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్యాన్స్ చేసేందుకు వచ్చిన తనపై నలుగురు యువకులు దాడి చేయడయే కాకుండా గ్యాంగ్రేప్కు పాల్పడ్డట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.