పులివెందులలో కాల్పుల కలకలం
posted on Mar 28, 2023 @ 3:25PM
సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ కు భరత్ యాదవ్ బంధువు.
ఆ కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా పోలీసులు గతంలో విచారించారు. భరత్ కుమార్ యాదవ్ వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు.
డబ్బులకు సంబంధించిన గొడవే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దిలీప్ , భరత్ కుమార్ యాదవ్ మధ్య డబ్బుల విషయమై జరిగిన గొడవే ఈ కాల్పులకు కారణమని చెబుతున్నారు.