ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత

 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మహరాజ్‌గంజ్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ (75) మంగళవారం నాడు కన్నుమూశారు. 1978-83 మధ్యకాలంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఎల్కోటి ఎల్లారెడ్డి (76) మంగళవారం నాడు కన్నుమూశారు. ఎల్లారెడ్డి 1994, 1999లలో మక్తల్ ఎమ్మెల్యేగా, 2009లో నారాయణపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 1997-99లలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు.

Teluguone gnews banner