ఇంజనీరింగ్ విద్యార్థిని దారుణహత్య
posted on Jun 10, 2014 @ 11:37AM
తమిళనాడులోని కంచి దగ్గర ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని గుర్తుతెలియని వ్యక్తులు సజీవదహనం చేశారు. కంచి సమీపంలోని పరుత్తికులం గ్రామంలో కాంచీపురం - చెంగల్పట్టు రైల్వే పట్టాల పక్కన కాలిపోయిన స్థితిలో 20 ఏళ్ల యువతి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహం షకీనా (23) అనే ఇంజనీరింగ్ విద్యార్థినిదిగా నిర్ధారించారు. షకీనా మృతదేహం దగ్గర్లో ఒక బ్యాంక్ పాస్ బుక్ చినిగిపోయిన స్థితిలో కనిపించింది. పక్కనే ఏటీఎం కార్డు లభించింది. షకీనా కంచి సమీపంలోని పొన్నేరికరై ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. ఆమె సొంత ఊరు దిండుగల్ జిల్లా ఇలాపటి గ్రామం. షకీనా కాలిపోయిన స్థితిలో ఉన్నందున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆమె మృతి చెందిన ప్రాంతంలో ఒక లేఖ కూడా లభించినట్లు తెలుస్తోంది. అందులో కళాశాల ఫీజును చెల్లించలేక పోతున్నందున మనోవేదనతో ఉన్నట్లు విద్యార్థిని రాసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే వాస్తవాలను తారుమారుచేసేందుకు హంతుకుడు ఈ లేఖను రాసి ఉండవచ్చని భావిస్తున్నారు.