ఏపీలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఈసీ షెడ్యూల్
posted on Jun 15, 2020 @ 4:59PM
ఏపీలో ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18 వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉంది. 26న నామినేషన్లను పరిశీలన, 29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. జులై 6న పోలింగ్ జరగనుంది. శాసనసభ్యుల కోటాలో ఈ స్థానం భర్తీ కానుంది. జులై 6వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.