హైకోర్టు తీర్పులపై వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్...
posted on Oct 2, 2020 @ 12:34PM
ఏపీలోని జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల పై ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టు వరుసగా అక్షింతలు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ హైకోర్టు తీరును తప్పుబట్టారు. పరిపాలన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటి పరిధిలో అవి పని చేసుకుంటే మంచిదన్నారు. గత కొద్ది రోజులుగా హైకోర్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బాదేస్తోందన్నారు. రోజువారీ జరిగే పరిపాలన వ్యవహారాలలో కోర్టులు జోక్యం చేసుకుంటే ఇక ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత అంశాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయని, అయితే రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు తెలుసునని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ సందర్భంగా అన్నారు.