తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగింపునకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత రెండు రోజులతో పోలిస్తే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది.

శుక్రవారం (మే31) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక గురువారం శ్రీవారిని మొత్తం 64వేల 115 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 32 వేల 711 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 23లక్షల రూపాయలు వచ్చింది. 

Teluguone gnews banner