తిరుమలలో పెరిగిన రద్దీ
posted on May 17, 2024 9:06AM
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (మే 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలి వరకూ సాగింది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం(మే 16) శ్రీవారిని మొత్తం 76వేల369 మంది దర్శించుకున్నారు.
వారిలో 41వేల 927 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 63లక్సల రూపాయలు వచ్చింది.