భారత్ లోని ఆ నగరాల్లో కరోనా తగ్గుముఖం.. ఎయిమ్స్ డైరెక్టర్
posted on Jul 24, 2020 @ 6:51PM
మన దేశం లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే కొన్ని నగారాలలో మాత్రం కరోనా వ్యాప్తి ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకొని ఇపుడు తగ్గు ముఖం పడుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలతో పాటు దక్షిణ భరత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పీక్ స్టేజ్ పూర్తయి, అక్కడ కేసుల గ్రాఫ్ క్రమంగా కిందికి దిగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఐతే ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం కఠినమైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే, భారత్ లోని అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని, దీంతో భౌతికదూరం పాటించడంలేదని, మాస్కులు కూడా ధరించకుండా బయటికి వస్తున్నారని, దీంతో మరోసారి కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన హెచ్చరించారు.