తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 650 కు పెరిగింది!
posted on Apr 15, 2020 @ 9:47PM
తెలంగాణలో కొత్తగా బుధవారం నాడు 6 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు 8 మంది కరోనా నుంచి కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ చేశారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 118కి చేరింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 514 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ బుల్లెటిన్ విడుదల చేసింది.
తెలంగాణాలో అత్యధికంగా హైదరాబాద్ 267 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్లో36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వికారాబాద్ (32), సూర్యాపేట (23) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జనగామ జిల్లాలో ఇద్దరికి కరోనా సోకగా.. వారిద్దరూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆ జిల్లాలో కోవిడ్ ఫ్రీగా మారింది. మహబూబాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో నలుగురు కోవిడ్ బారిన పడగా.. ఇద్దరు కోలుకున్నారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
తెలంగాణాలో 259 కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా భారీ సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసింది.
దేశవ్యాప్తంగా 170 హాట్స్పాట్లు వుంటే అందులో తెలంగాణలో 8 హాట్ స్పాట్లను గుర్తించారు. ఏపీలో 11 జిల్లాలు హాట్ స్పాట్లుగా ఉన్నాయి.