చర్లపల్లి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

 

చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చే చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి కంపెనీపై రైడ్ చేసి 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి... కొన్ని కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటినీ పోలీసులు అరెస్టు చేసి అతని చరిత్ర పై ఆరాతీస్తున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ ఓలేటి గతంలో జీవికే బయో సైన్స్ లో 12 సంవత్స రాల పాటు కెమికల్ అనాలసిస్‌గా పనిచేశాడు.

ఐదు సంవత్సరాల క్రితం జీవికే బయోసైన్స్ నుంచి బయటికి వచ్చిన విజయ్ ఓలేటి కెమికల్ తయారీ కంపెనీ తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడం లో విజయ్ ఓలేటి దిట్ట...మహారాష్ట్ర చెందిన తానాజీ తో కలిసి విజయ్ వాగ్దేవి ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి... చర్లపల్లి లో డ్రగ్స్ రా మెటీరియల్ తయారు చేసి నాచారంలో డ్రగ్స్ తయారు చేసేవాడు..తానాజీ తో కలిసి విజయ్ ఐదేళ్లుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తు న్నాడు. అయితే విజయ్ అతి కొద్ది మంది సిబ్బంది తో మాత్రమే కంపెనీని నడపించడమే కాకుండా అది కూడా కేవలం రాత్రిపూట మాత్రమే నడిపేవారు.


 ఆ విధంగా తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసుల కంట పడకుండా వివిధ మార్గాల ద్వారా మన దేశం తో పాటు విదేశా లకు సరఫరా చేసేవాడు. విజయ్  ముందుగా అత్యంత ప్రమాదక రమైన మెఫీడిన్  డ్రగ్ తయారు చేశాడు. అనంతరం మెఫీడిన్  డ్రగ్ నుంచి ఎక్సెసి, మోలీ ,xtc, MDMA  మొదలగు నాలుగు రకాల డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరులకు రహస్యం గా వివిధ వస్తువుల మాటున తరలించేవారు. అయితే ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని దేశ విదేశా లకు సరఫరా చేసేందుకు విజయ్ ఒక గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 

అంతేకాకుండా డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా పోలీ సులు గుర్తించారు. ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని విజయ్ మొదటగా హైదరా బాదులో అమ్మి అనంతరం విదేశాలకు సరఫరా చేసేవాడు. ప్రతిసారి ఐదు కేజీల చొప్పున మెపిడ్రిన్ అమ్మే వాడు. ఒక్కొక్క కేజీ 50 లక్షల రూపా యల చొప్పున అమ్మేవాడు. ఈ విధంగా నాచారం, చర్లపల్లిలో డ్రగ్స్ తయారుచేసి దర్జాగా విక్ర యాలు చేసేవాడు. ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షల తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి... కంపెనీ యజమాని విజయ్ ఓలేటి, తానాజీ లతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. 

అయితే గతంలో డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లుగా గుర్తించిన తెలంగాణ నార్కో టిక్ బృందం డ్రగ్స్ తయారీపై విజయ్ కి నోటీ సులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విష యంపై విజయ్ కోర్టు ను ఆశ్రయించారు. అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ పట్టుబ డడంతో హైదరా బాద్ చర్లపల్లి లో డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. చర్ల పల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో రూ.11. 58 కోట్లు విలువైన మెఫిడ్రిన్ తయారీ చేస్తున్నారు. 35,500 లీటర్లు రసాయ నాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాదీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ అరెస్ట్ చేసి...ఇద్దరిని నిందితులను ట్రాన్సిట్ వారెంట్ తో ముంబై కి తరలించారు.

నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!

నకిలీ ఈ-చలాన్  చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ  సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా  ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్  చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ  నకిలీ లింక్ పై  క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత  చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.  ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.  

మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్

పేరు మోసిన హైటెక్ దొంగ బత్తుల ప్రభాకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో పోలీస్ కస్టడీ నుండి తప్పిం చుకొని పరారైన ఈ నింది తుడు ప్రస్తుతం తమిళ నాడులో వరస నేరాలకు పాల్పడుతున్నట్లు గా తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. గతంలో హైదరాబాదులోని ప్రిజం పబ్ లో కాల్పులు జరిపి హల్చల్ సృష్టించిన బత్తుల ప్రభాకర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పిటి వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ కు తరలించి కోర్టులో హాజరుపరిచారు. సెప్టెంబర్ నెలలో విజయ వాడ కోర్టులో హాజరు పరిచిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మార్గమ ధ్యంలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు.అదే సమయంలో బత్తుల ప్రభాకర్ మూత్ర విసర్జనకు అంటూ  పోలీసుల కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయాడు. అప్పటి నుండి అతడి కోసం గాలింపు సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో  ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియో పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం తమిళనాడులో ఉంటూ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ట్లుగా ఆ వీడియో ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బత్తుల ప్రభాకర్ చోరీ కి పాల్పడినట్లు  పోలీసులు గుర్తించారు. ఆ కాలేజీ లాకర్ నుండి 60 లక్షల వరకు నగదు కొట్టేసినట్లుగా పోలీసులు గుర్తించారు.     ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి హైదరాబాదులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో దొంగతనానికి వచ్చిన ప్రభాకర్ అక్కడ పోలీసుల నుండి తప్పించుకొని ప్రిజం పబ్బులోకి వెళ్లి కాల్పులు జరిపాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతన్ని తీసుకొని కోర్టులో హాజరు పరిచి రాజమండ్రి జైలుకు తరలిస్తున్న సమయంలో విజయ వాడ నుండి తప్పించుకొని పారిపోయాడు. అలా తప్పించుకొని పారిపోయిన బత్తుల ప్రభాకర్ చెన్నైలో సెటిల్ అయ్యి అక్కడ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఆ విధంగా చోరీల ద్వారా సంపా దించిన డబ్బుతో బత్తుల ప్రభాకర్ జల్సాలు చేస్తున్నట్లు సమాచారం. చెన్నై కాలేజీ చోరీకి సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ పోలీసుల చేతికి చిక్కడంతో బత్తుల ప్రభాకర్ జాడ కనుక్కున్నారు. ప్రస్తుతం అతడిపై మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పరారీలో ఉన్న బత్తుల ప్రభాకర్ తమిళనాడులో ప్రత్యక్షమై చోరీలకు పాల్పడుతూ ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ పరారీలో ఉన్న నేరస్తుల్ని అదుపులోకి తీసుకునేందుకు మూడు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. నేర చరిత్ర కలిగిన బత్తుల ప్రభాకర్ పట్టుకోవడం పోలీసులకు ఒక సవాలుగా మారింది.

రికార్డుల మోత.. క్రికెట్ చరిత్ర తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ

చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రికార్డుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రొఫెషనల్ క్రికెట్ లో సెంచరీ చేసి రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ..డొమెస్టిక్ క్రికెట్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బ్యాటుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ.  క్రీజులోకి దిగాడంటే సెంచరీ బాదాల్సిందే అన్నట్లు విరుచుకుపడుతున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో బిహార్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ కేవలం  84 బంతుల్లో190 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ క్రమంలో రెండు ప్రపంచ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ చరిత్ర సృష్టించాడు. కేవలం 36 బంతుల్లోనే తొలి లిస్ట్-ఏ సెంచరీ పూర్తి చేశాడు. ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ 14 ఏళ్ల వయసులో శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. భారతీయులలో వేగవంతమైన లిస్ట్-ఏ శతకాల జాబితాలో వైభవ్ సూర్యవంశీ  రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది అన్మోల్‌ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. శతకం తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చిన వైభవ్‌ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మార్క్‌ను దాటాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏబీ డివిలియర్స్‌ (64 బంతులు) పేరిట ఉండేది. డబుల్ సెంచరీ రికార్డును కూడా బద్దలు కొట్టే దిశగా సాగిన వైభవ్‌.. 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయినా అతడి ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో  226.19 స్ట్రైక్‌రేట్‌తో ఆడి అరుణాచల్ బౌలర్లను వణికించాడు. వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పటికే క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా, రాజస్థాన్ రాయల్స్ తరఫున సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డులు నెలకొల్పాడు. అలాగే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్  ఏ  జట్టు తరఫున 32 బంతుల్లోనే శతకం బాదాడు. విజయ్ హజారే ట్రోఫీ కొనసాగుతున్న కొద్దీ, ఇప్పుడు అందరి చూపు  వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. 14 ఏళ్ల వయసులోనే రికార్డులు బద్దలు కొడుతూ, యువ క్రికెటర్  నిర్వచనాన్నే మార్చేస్తున్నాడు. అతడి ప్రయాణం ఇప్పుడే మొదలైంది… మున్నందు ఆ యువకెరటం దాటాల్సిన  మైలురాళ్లు ఇంకా ఎన్ని ఎదురుచూస్తున్నాయో?

ఫ్రం 24 టు నంబర్ వన్.. ఏపీ పంచాయతీరాజ్ పై పవన్ ముద్ర

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ శాఖపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేయడంతో అనతి కాలంలోనే ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా  తనదైన ముద్ర వేయడం వల్లనే ఇది సాధ్యమైందని పరిశీలకులు అంటున్నారు.   ఆంధ్రప్రదేశ్  ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తు న్నారు. ముఖ్యంగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన కృషి ఫలితంగా ఆ శాఖలు జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. గతంలో ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాభివృద్ధి విషయంలో దేశంలో  24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, పవన్ కల్యాణ్ ఆ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. జాతీయ పంచాయతీ అవార్డులలో ఏపీకి నాలుగు అవార్డులు లభించాయి. మొత్తంగా పంచాయతీరాజ్ శాఖ పనితీరు విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.  

నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు.. చంద్రబాబు

రైతులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా, నిర్దేశిత గడువులోగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ, పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో   సమీక్ష నిర్వహించారు.  రైతులకు లబ్ధి చేకూరేలా  రబీ, ఖరీఫ్ పంటలకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.   రబీ- ఖరీఫ్- రబీ సీజన్లలో ఏయే పంటలు వేయాలి, రైతులకు ఏది ప్రయోజనం అన్న విషయాలపై వారిలో అవగాహన కల్పించాలన్నారు. పంట ఉత్పత్తుల నాణ్యతనుపెంపుతో పాటు, కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సంద ర్భంగా అధికారయంత్రాంగాన్ని ఆదేశించారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్ప త్తులను తరలించేందుకు వాటి ప్రాసెసింగ్‌పై దృష్టి సారించడంతో పాటు,  దేశవ్యాప్తంగా వివిధ మార్కెట్లకు పంట ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా రైల్ కార్గో వంటి లాజిస్టిక్స్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఇక ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎదురవుతున్న బ్యాంకు గ్యారెంటీ సమస్యలను పరిష్కరించి, రైతులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని అక్కడికక్కడే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కన్వీనర్‌తో  మాట్లాడి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు.   స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.  

సాగు భూములకు మాత్రమే రైతు భరోసా!

రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై మంగళవారం (డిసెంబర్ 23) నిర్వహించిన సమీక్షా సమావేశంలో  మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇక నుంచి ఈ పథకం నిధులు కేవలం సాగు రైతులకు మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.  గత ప్రభుత్వం విచ్చల విడిగా ఈ పథకం నిధులను సాగుకు అనుకూలంగా లేని భూములకు కూడా ఇచ్చి దుర్వినియోగం చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై అలా ఇచ్చే ప్రశక్తే లేదని పేర్కొన్నారు.  గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు బంధు పేరుతో ఉన్న ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రైతు భరోసాగా మార్చారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో రైతన్నలకు ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఎకరాకు నాలుగు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి మొత్తం ఎనిమిది వేలు చెల్లించింది. ఆ తరువాత ఈ పెట్టుబడి సాయాన్ని ఐదు వేల రూపాయలకు పెంచింది.   అయితే, ఈ పథకంలో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయం చేయని వారు, బీడు భూములు, కొండలు, గుట్టలు ఉన్న భూములకు కూడా నిధులు పొందినట్లు గుర్తించారు.  ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత  రైతు భరోసాగా ఈ పథకం పేరు మార్చి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఆరు వేల రూపాయలకు పెంచింది.  అయితే ఈ పథకం ద్వారా  అనర్హులు  కూడా లబ్ధి పొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు సాగు చేసే భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. 

అమెరికాలో 30 మంది ఇండియన్స్ అరెస్ట్.. ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికాలో 30 మంది ఇండియన్స్ ను అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారంటూ ఈ అరెస్టులు జరిగాయి.  కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించినందున వీరిని అరెస్టు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.   గత నెల 23 నుంచి ఈ నెల 12 వరకూ ఇంటర్ స్టేట్ హైవేలు,  ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోనికి తీసుకోగా, వీరిలో 30 మంది ఇండియన్స్ ఉన్నారు.  ఇండియన్  డ్రైవ‌ర్ల‌ కార‌ణంగా అమెరికాలో జ‌రిగిన‌ కొన్ని ప్రమాదాల్లో పలువురు మరణించగా, మరింత మంది తీవ్రంగా గాపడ్డారని అధికారులు తెలిపారు. సాధారణ కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడపడం నేరమన్న వారు,  ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యమన్నారు. అందుకే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 

ఆర్డనరీ బస్సులలోనూ ఏసీ.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకువెడుతోంది. సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల నంగంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు.  గ్రీన్ ఎనర్జీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబునాయుడు  రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.   పల్లె వెలుగు  బస్సులతో సహా ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో ఇప్పటి నుండి తప్పనిసరిగా ఏసీ సౌకర్యం ఉండాలన్నారు.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1,450 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనుందని తెలిపారు.   పల్లె వెలుగు సహా రాష్ట్రంలోని అన్ని బస్సులలోనూ   ఇన్‌బిల్ట్ ఎయిర్ కండిషనింగ్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లె వెలుగు బస్సులు సహా ఆర్డనరీ బస్సుల ను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి, వాటిలో కూడా ఎయిర్ కండీషన్ అమర్చడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.   

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా!

తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసిరింది. ఈ నెల తొలి వార నుంచీ ప్రారంభమైన చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ రెండో వారంలోనే చలిపులి తెలుగు రాష్ట్రాలను వణికించడం మొదలైంది.  ఉదయం, రాత్రి వేళల్లో చలి గాలులకు తోడు దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది.  గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి.  కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదౌతున్నాయి.  తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల   ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండగా.. నగర శివారు ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు  సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.  అలాగే ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో   చలి తీవ్రత అధికంగా ఉంది.   ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి విపరీతంగా ఉన్న నేపథ్యంలో చిన్నారులు, వృద్ధులతోపాటు శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ కోల్డ్ వేవ్ ఈ నెలాఖరువరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.  

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్

ఇస్రో మరో ఘన విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది.  శ్రీహరి కోటలోని షార్ నుంచి బాహుబలి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది.  ఎల్‌వీఎం3-ఎం6 బాహుబలి రాకెట్  అమెరికాకు చెంది భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ని నింగిలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు ఆరువేల ఒక వంద కిలోలు.  అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పెస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు. ఈ  ప్రయోగంతో  ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ఇస్రోకి ఇదే మొదటి సారి కావడం విశేషం.