చంద్రబాబు, కేసీఆర్ల మధ్య రాయబారి.. మాకు తెలుసు.. షబ్బీర్ అలీ
posted on Oct 23, 2015 @ 5:11PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శంకుస్థాపనకు పిలవడం.. ఆయన కూడా ఇచ్చిన మాట తప్పకుండా శంకుస్థాపనకు రావడం జరిగింది. అయితే వీరిద్దరి మనసులో ఏమున్నా కానీ.. కలిసి సన్నిహితంగా ఉండటం మాత్రం తెలుగు ప్రజలకు ఆనందాన్నిచ్చే విషయమే. కానీ వీరిద్దరి కలయికపై తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు మధ్య ఒప్పందం కుదరడానికి మధ్యవర్తిగా వ్యవహరించిందో ఎవరో తమకు తెలుసునని అన్నారు. అంతేకాదు సమయం వచ్చినప్పుడు మధ్యవర్తి పేరు బయటపెడుతామని ట్విస్ట్ కూడా ఇచ్చారు. కాగా.. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీ ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర విభజనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర విభజనను తప్పుబట్టారని.. అలాంటి మోడీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు, కేసీఆరే అని విమర్శించారు. విభజన హామీలను మోడియే కాదు ఎవరు ప్రధానిగా వచ్చినా అమలు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.