కాపులకు చంద్రబాబు నాయుడు వరాల జల్లు

 

తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలు సాగిస్తున్న టి.డి.పి. అధిపతి చంద్రబాబు నాయుడు కాపులపై వరాల జల్లు కురిపించారు. పాదయాత్రలో భాగంగా జరిగిన వివిధ సభల్లో మాట్లాడుతూ ... అగ్రవర్ణాల్లో కాపుల్లోనే పేదలు ఎక్కువగా ఉన్నారని, ఈ సామాజిక వర్గానికి ఏటా వెయ్యి కోట్లు రూపాయలు ఐదుసంవత్సరాలపాటు ఐదు కోట్లు వెచ్చిస్తామని, టిడిపి అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్ అంశంపైనా సర్వే చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని, బిసి రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా కాపులకోసం ప్రత్యేక రిజర్వేషన్ ప్రక్రియపై కసరత్తు చేస్తున్నామని, ముందునుంచీ కాపులు తమ పార్టీకి మద్ధతుగా ఉన్నారని, చిరంజీవిని నమ్మి కొంతకాలం దూరం కావడం వల్లే గతఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని, వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కాపుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని కాపులకు వాగ్దానం చేశారు.

Teluguone gnews banner