మల్లారెడ్డికి ఊహించని షాక్
posted on Dec 13, 2023 @ 2:41PM
తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మీద పోలీసు కేసు నమోదైంది. శామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ,ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గంగా రామ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిష్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గిరిజనులకు చెందిన భూమిని తమ పేరు మీద బలవంతంగా రాయించుకునేందుకు ప్రయత్నం చేసిన మల్లారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్పేట్ తహశీల్దార్ పై సైతం కేసు నమోదు అయ్యినట్లు పోలీసులు పేర్కొన్నారు.
గతంలోనూ మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. భూ కబ్జాకు సంబంధించి బాధితులు ఫిబ్రవరిలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూమిని ఆక్రమించడమే కాకుండా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి మంత్రి, తమ ల్యాండ్లోకి తమనే అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి మల్లారెడ్డి మీద ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి స్టేజి ఎక్కితే జోకర్ స్టేజి దిగగానే బ్రోకర్ గా మారిపోతారన్నారు. మల్లారెడ్డి కూడా రేవంత్ ని అంతే తీవ్రతతో విమర్శించారు. ఈ ఎన్నికలలో అధికార మార్పిడి జరిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రయ్యారు. గత ప్రభుత్వంలో కూడా మల్లారెడ్డిపై భూ కబ్జా ఫిర్యాదులు వచ్చినప్పటికీ మాజీ మంత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసి తన మార్కును నిరూపించుకుంది.