పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి...డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సందడి
posted on May 12, 2024 @ 3:09PM
ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25లోకసభ ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తుండగా తెలంగాణలో మాత్రం కేవలం 17 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈవీఎంలు, తదితర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తమకు కేటాయించిన ఈవీఎంలు, తదితర సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. కాగా, సెక్టార్ ల వారీగా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. పోలింగ్ వేళ అనుసరించాల్సిన విధివిధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. ఇప్పటికే వారికి ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చారు.