కసబ్ కి ఉరిశిక్ష ఖరారుచేసిన సుప్రీంకోర్టు
posted on Aug 29, 2012 @ 11:47AM
ముంబై మారణకాండ కేసులో ప్రథాన నిందితుడైన కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ కి మరణ శిక్ష తప్ప మరో శిక్ష విధించడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. కసబ్ కి గతంలోనే ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. తనని మానసికంగా యాంత్రికంగా తయారు చేసి భారత్ మీదికి వదిలారని కసబ్ తన వాంగ్మూలంలో చెప్పాడు. పాకిస్తాన్.. భారత్ వ్యతిరేకంగా కుట్రచేస్తోందన్న విషయం తనకు తెలియకుండానే ఓ పావులా ఉపయోగపడ్డానని కసబ్ ఒప్పుకున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను భారత్ కి వ్యతిరేకంగా కుట్రచేయలేదు కనుక మరణశిక్షనుంచి తప్పిచాలని అభ్యర్థించాడు. కిందికోర్టు తన తీర్పును మార్చుకోకపోవడంతో సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకున్నాడు. సుప్రీంకోర్ట్ కూడా అజ్మల్ కసబ్ కి ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ పై మొత్తం 12 కేసులున్నాయి.