కుల బహిష్కరణ.. పోలీస్టేషన్.. ఇంటిపై దాడి..
posted on Jun 21, 2021 @ 4:14PM
కాలి నడక నుండి రాకెట్ ప్రయాణం. అది మానవుడి నుండి అలెక్సా వరకు ఈ సమాజంలో ఎన్నో పరిణామాలు జరిగిన ఇంకా మారానిది..రూపుమాపనిది కులవ్యవస్థ.. అందరి రంగులు వేరు కావచ్చు కానీ, రక్తం ఒకటే.. భాషాలు యాసలు వేరు కావచ్చు కానీ ప్రాణం ఒక్కటే.. ఇలా అందరికి అన్ని పోలికలు ఉన్న.. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ శ్రీ శ్రీ కవిత్వం లాగ పదండి ముందుకు అని దూసుకుపోతుంటే.. ఇంకా ఈ సమాజంలో కుల గజ్జీ వదలడంలేదు. కొన్ని చోట్ల ఆ కులగజ్జె పరిపాలన చేస్తుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. కుల బహిష్కరణ పేరుతో దుండగులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై పడి బీభత్సం సృష్టించారు. చంపుతామని బెదిరించడమే కాదు.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జగిత్యాల రూరల్ మండలంలోని మోతే గ్రామంలో బావాజీ పల్లెలో భూ పంచాయతీ విషయంలో కొండపల్లి నీలయ్య కుటుంబాన్ని గ్రామంలోని కులస్థులు ఆంక్షలు విధించారు. ఆ కుటుంబసభ్యులను ఎవరిని ఎటువంటి కార్యక్రమాలకు పిలవ్వద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బహిష్కరణపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ.. కులపెద్దలు రెచ్చిపోయారు. నీలయ్య ఇంట్లో లేని సమయంలో మిగిలిని కుటుంబసభ్యులపై ఆడవాళ్లు పిల్లలు అని చూడకుండా దాడికి దిగారు. ఇంట్లో టీవీ, ఫర్నీచర్, ఫ్రిడ్జ్తో పాటు ఇంట్లోని వస్తువులను పగలగొట్టారు. టూ వీలర్, సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. మొత్తం 15 మంది వరకు వచ్చి తమ ఇంటిపై దాడికి దిగారని బాధితులు తెలిపారు.
ఈ ఘటనపై నీలయ్య కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బవాజీపల్లెకు చెందిన వీరయ్య, గంగారావు, సంపత్, రవి, మస్తాన్ అనే ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కులాలు లేని మతాలు లేని నవసమాజమే మన ధ్యేయంగా ముందుకు సాగాలి.. ఆ రోజు కోసం అందరు ఆలోచించాలి. అందుకు ముందుకు అడుగులు వెయ్యాలి.