చావును దగ్గర నుంచి చూసిన ఆశారాం బాపు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు, ఆయనతో పాటు మరో నలుగురు శిష్యులు హెలికాప్టర్‌ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయట పడ్డారు. గుజరాత్‌లోని గోధ్రాలో రెండు రోజుల పాటు సత్సంగ్‌లో ప్రవచనాలు వినిపించేందుకు ఆశారాం బాపు, ఆయన శిష్యులు బయలు దేరి వెళ్లారు. గోధ్రాలోని సైన్స్ కళాశాలలో హెలికాప్టర్ ల్యాండింగ్‌ కావాల్సి వుండగా, కొద్దిసేపు ముందు అందులో సాంకేతిక లోపం రావటంతో హెలికాప్టర్ పైన నుంచి కిందపడి౦ది. కింద పడిన హెలికాప్టర్ ఒక పక్కకు ఒరిగి మూడు ముక్కలైంది. ఆయితే హెలికాప్టర్ కొద్ది ఎత్తులో నుంచి పడిపోవడంతో ఆసారం బాపు  ప్రాణాలతో బయటపడ్డారు. హెలికాప్టర్ అద్దాలు పగులగొట్టి పైలట్, బాపులను బయటకు తీసి వెంటనే వారిని సమీపంలో ఉన్న ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.