దిశా పథకం అమలుకు 47.93 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు పాలనా అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
posted on Feb 11, 2020 @ 2:35PM
దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోన్న ప్రభుత్వం. దిశా పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్న హోంశాఖ. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు. పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధానికి, పర్యవేక్షణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం ఈ కమిటీ ఏర్పాటు. ఏడుగురు అధికారులు, సిబ్బందితో కూడిన ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పంచాయితీరాజ్ - గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.