ఫీజు రీయింబర్స్ మెంట్ తల్లి అక్కౌంట్లోకే!
posted on Apr 14, 2020 @ 6:00PM
ఫీజు రీయింబర్స్మెంట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము డైరెక్ట్ గా కాలేజ్ లకి ట్రాన్స్ ఫర్ చేసేవారు.. కానీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల తల్లి బ్యాంక్ ఖాతాలోకే ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. త్రైమాసికానికి ఓ విడత చొప్పున రీయింబర్స్మెంట్ సొమ్మును తల్లుల అకౌంట్లో జమ చేయనున్నారు.
దీంతో కాలేజీ యాజమన్యాలతోపాటు విద్యార్థులకు కూడా ఊరట చేకూరే అవకాశం ఉంది. 2018-19కి సంబంధించి రూ.1800 కోట్ల బకాయిలను చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించామని సీఎం తెలిపారు.
తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని కాలేజీలకు సీఎం ఆదేశాలు జారీచేశారు.దీనికి సంబంధించి 191 కాలేజీలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఆదేశాల సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. అవసరమైతే కాలేజీలపై చర్యలు తీసుకుని, బ్లాక్ లిస్టులో పెడతామని సి.ఎం. హెచ్చరించారు.