ఇసుక పాలసీ విషయంలో కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చిన ఏపీ సిఎం జగన్

ఏపీ నూతనంగా తీసుకువచ్చిన ఇసుక పాలసీ అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు సీఎం జగన్. అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇసుక పాలసీపై జిల్లా కలెక్టర్ లతో తన కార్యదర్శి ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇసుక పాలసీ అమలులో అలసత్వం వహిస్తే ఊరుకోమని హెచ్చరించారు జగన్. ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. చిన్న పొరపాటు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం.

తాము తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం దేశంలోనే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు జగన్. ఒక వైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పారదర్శకమైన అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు జగన్. ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా కలెక్టర్ లు సీరియస్ గా పని చేయాలని ఆదేశించారు.

Teluguone gnews banner