Read more!

ఆంధ్రా యూనివర్శిటీలో విద్యార్ధి ఆత్మహత్య..

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లా కోర్సును అభ్యసిస్తున్న యశస్వి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని మమతా హాస్టల్‌లో కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్థరాత్రి వరకు గదిలో ఉన్న స్నేహితులు కరెంట్ లేకపోవడంతో వసతిగృహం మేడపైకి వెళ్లారు. అందరూ పైకి వెళ్లినా యశస్వి మాత్రం గదిలోనే ఉండిపోయాడు..ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యశస్వి స్వగ్రామం గుంటూరు జిల్లా చిలకలూరిపేట. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు యశస్వి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.