ప్రాణ్ కు అమితాబ్ శుభాకాంక్షలు

 

బాలీవుడ్ నటుడు ప్రాణ్ కు 2012 సంవత్సరానికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎన్నిక చేసింది. ఎన్నో బాలీవుడ్ చిత్రాలలో కలిసి నటించిన బిగ్ బి అమితాబ్ ప్రాణ్ కు శుభాభినందనలు తెలిపాడు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో అమితాబ్, ప్రాణ్ గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. "ప్రాణ్ మంచి నటుడు, భారతీయ సినిమా ప్రపంచానికి అతను ఒక మూలస్తంభం వంటి వాడు, అతనికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా వుంది''. మరొక సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లోనూ ఈ విధంగా పోస్టింగ్ చేశాడు. "ప్రాణ్ ఈ అవార్డుకు అర్హుడు. తనకు ఆప్తమిత్రుడు, వ్యక్తిత్వంగల వ్యక్తి అని, అతను ఆరోగ్యంగా ఉండాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, అతనిఇకి తన శుభాకాంక్షలు'' అని రాశాడు. అమితాబ్, ప్రాణ్ కలిసి నటించిన చిత్రాలలో జంజీర్, డాన్ మరపురాని చిత్రాలు

Teluguone gnews banner