అమరావతి... ఏ రోజున ఏం జరిగిందంటే..
posted on Nov 23, 2021 @ 10:08AM
ఆంధ్రుల కలల రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించింది మొదలు అమరావతి నిర్మాణ పనులు చకచకా జరిగిపోయాయి. కేవలం రెండు నెలల వ్యవధిలోనే రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోని ప్రముఖలంతా విచ్చేసి అమరావతికి ఆశిస్సులు అందించారు. కాని 2019లో సీన్ మారిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడం అమరావతికి గండంగా మారింది. ఆంధ్రుల కోటి ఆశ... మూడు ముక్కలాటలుగా మారిపోయింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన సంచలనమైంది.
జగన్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏడు వందలకు పైగా రోజులుగా రోడ్డుపైనే ఉన్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినదిస్తున్నారు. సోమవారం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది జగన్ రెడ్డి సర్కార్. దీంతో అమరావతిపై శంకుస్థాపన నుంచి ఉపసంహరణ వరకు అన్నీ సంచలనమే..
అమరావతిపై ఏ రోజున ఏం జరిగిందో చూద్దాం..
2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీ తీర్మానం
డిసెంబరు 23: ఏపీసీఆర్డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ
డిసెంబరు 30: సీఆర్డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ. విస్తీర్ణంలో కేపిటల్ రీజియన్ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం
2015 ఫిబ్రవరి 28: కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు
అక్టోబరు 22: ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
2016 ఏప్రిల్ 25: వెలగపూడి సచివాలయం ప్రారంభం.
జూన్ 6: సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం
అక్టోబరు 28: పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ శంకుస్థాపన
2017 మార్చి 2: వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
డిసెంబరు 27: రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
2019 ఫిబ్రవరి 3: జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్
డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన
డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు
2020 జనవరి 3: మూడు రాజధానుల్ని సిఫారసు చేస్తూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
జనవరి 20: నిరసనగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న రైతులపై లాఠీఛార్జి
జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ
ఫిబ్రవరి 10: ప్రొసీజర్ ఫాలో అవ్వనందున బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపలేనంటూ మండలి ఛైర్మన్కు తిప్పి పంపిన ఇన్ఛార్జి సెక్రటరీ
జూన్ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం
జూన్ 17: కౌన్సిల్లో తెదేపాఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు
జులై 31: బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్
2021 నవంబరు 1: తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు
నవంబరు 22: కొత్త బిల్లులు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన ప్రభుత్వం