తెలంగాణ పై మళ్ళీ అదే వాదన !

తెలంగాణా "మిగులు ఆదాయా''న్ని (సర్ ప్లస్) తెలుగు సోదరులు మింగారా? మళ్ళీ అదే వాదన !

- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

పాడిందే పాడటం కొందరికి వదిలించుకోడానికి వీలుకాని అలవాటు. అలాగే, తెలంగాణా "మిగులు'' ["సర్ ప్లస్'']ను రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలవారూ మింగేసి తెలంగాణాకు తొంటిచెయ్యి చూపుయాన్నారన్న అపవాదును మరోసారి కొందరు తెరపైకి తెస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణా రైతాంగసాయుధ పోరాటం ఫలితంగానే తెలంగాణాలోని తెలుగుప్రాంతాలూ, ఆంధ్రలోని తెలుగుప్రాంతాలూ కలిసి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడి తెలుగుజాతంతా సమైక్యం కావడం సాధ్యమయింది. ఇది చారిత్రిక సత్యం. ఈ రెండు తెలుగుప్రాంతాల విలీనీకరణ సందర్భంగా, అప్పటికి మొగలాయిల (ముస్లీం) పరాయిపాలనలో విద్యకు, ఆరోగ్యానికి, సామాజికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికీ మాతృభాషగా తెలుగు వాడకానికి నోచుకోని ఫలితంగా బ్రిటిషాంధ్రటో పోల్చినప్పుడు తెలంగాణా వెనుకబడి ఉన్నందున దానికి రక్షణలు కల్పిస్తూ విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు "పెద్దమనుషుల ఒప్పందం'' కుదిరింది. దానికి తగినట్టుగా నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయప్రాంతాల నాయకుల మధ్య "మాట'' ప్రకారం ఆ రక్షణలు క్రమంగా అమలులోకి వచ్చాయి; ఒప్పందం అమలులో క్షేత్రస్థాయిలో కొన్ని ఒడిదుడుకులూ జరిగి ఉండవచ్చు. కాని అవి క్రమంగా తొలగిపోతూ వస్తున్నాయి. అయితే "పెద్దమనుషుల ఒప్పందం'' పైన సంతకాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరుప్రాంతాలకు చెందిన మంత్రులూ, కడచిన 56 ఏళ్ళుగానూ ఉన్నందున, ఒకవేళ "ఒప్పందం' అమలులో ఒడిదుడుకులు జరుగుతున్నప్పుడు, వాటిని పసికట్టి తొలగించవలసిన బాధ్యత ఉభయప్రాంతాల మంత్రులకూ ఉండాలి.

 

దేశానికి స్వాతంత్ర్య (1947 ఆగస్టు) ప్రకటన జరిగిన తరువాత రెండేళ్ళ దాకా [1950 జూన్ వరకు] తెలుగువారి తెలంగాణా ప్రాంతం నిజాం పాలకుల నిరంకుశ రాజ్యంలో భాగంగానే ఉంటూ వచ్చింది. ఎటుతిరిగీ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాల చాటున ప్రవేశించిన యూనియన్ సైన్యాల రాకతో ఈ ప్రాంతానికి పూర్తిగా నిజాం పాలననుంచి రాజకీయ విమోచనం లభించింది. 1952 జనవరిలో దేశపు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో కూడా మొదటిసారిగా ఎన్నికల కోలాహలం చెలరేగింది.అందులో కాంగ్రెస్ ఒక పక్షంగాను, జయసూర్య నాయకత్వంలో కమ్యూనిస్టులు "ప్రజాతంత్ర ప్రజాస్వామ్య ఐక్యసంఘటన'' (పి.డి.ఎఫ్.)గా ఏర్పడి సంయుక్త ప్రతిపక్షంగా ఎన్నికల్లో పోటీ చేశారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో 1952 మార్చిలో హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ఏర్పడింది.


బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 1956 అక్టోబర్ ఆఖరిదాకా కొనసాగింది. కాగా 1955లో ఒకే భాషాసంస్కృతులు గల జాతి ప్రాతిపదికగా ఐక్య రాష్ట్రం ఏర్పడాలని తెలుగుప్రాంతాలన్నిటా ఆందోళన సాగింది. ఫలితంగా కేంద్రం ఈ సమస్యపైన ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఫజల్ ఆలీ కమీషన్ ను ఏర్పరచింది. ఈ కమీషన్ అభిప్రాయ సేకరణ తర్వాత నివేదిక సమర్పిస్తూ "భట్టిప్రోలు పంచాయితీ'' ధోరణిలో రెండు పరిష్కారాలు పరస్పరవిరుద్ధంగా సూచించింది. (1) తెలుగుప్రాంతాలన్నింటి ప్రగతికోసం, భవిష్యత్తులో వాటి భద్రతకోసం అవి విశాలాంధ్రగా ఏర్పడడం అన్నివిధాలా మంచి పరిష్కారమవుతుంది. (2) కాని, తెలంగాణా ప్రాంతంలో కొందరి అభిప్రాయం ప్రకారం "తెలంగాణా ప్రాంతం వెనుకబడినదిగా ఉండుటచే'' [మందుముల నరసింగరావు: "50 సంవత్సరాల హైదరాబా''దు] ప్రత్యేక రాష్ట్రంగా ఉండవచ్చునని కోరుకుంటున్నారు, అని కమీషన్ తెల్పింది. అలా కొందరు నాయకులు [వారిలో ప్రముఖులు బడా భూస్వాములయిన కొండా వెంకటరెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి] వెలిబుచ్చిన కోరిక నెరవేరనప్పుడు 1956లో "తెలంగాణా ప్రత్యేక రక్షణలు'' ఆధారంగా ఏర్పడిందే "ఆంధ్రప్రదేశ్''. నిజానికి అప్పటికి, అంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరేళ్ళ నాటికి విశాలాంధ్రలో అంతర్భాగమైన ఒక్క తెలంగాణా ప్రాంతమేగాక యావత్తు దేశంలోనూ అంతవరకూ భూస్వామ్యవ్యవస్థ కారణంగానూ, బ్రిటిష్ వాడి పరాయి పాలనవల్లనూ అనేక వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో మన ఇరుగుపొరుగైన మైసూర్, మహారాష్ట్రలు కూడా ఉన్నాయి.



కాని హైదరాబాద్ (స్టేట్) రాష్ట్ర శాసనసభలో కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు ఐక్య కర్నాటక, సంయుక్త మహారాష్ట్రల ఏర్పాటుకు పూర్తీ మద్ధతు పలుకగా [అప్పటికి ఆ ప్రాంతాలూ బాగా వెనుకబడి ఉన్నవే] తెలుగు మాట్లాడే తెలుగు ప్రజాప్రతినిధులయిన సభ్యులు కొందరిలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ భిన్నాభిప్రాయానికి నాయకత్వం అనేక దశాబ్దాల తరబడిగా తెలంగాణా ప్రజాబాహుళ్యాన్ని పీల్చి పిప్పి చేసిన నిజాం, అతనికి తోడుగా భూస్వామ్య, బడాజాగీర్ధారీ, 'దోర'లకు సంబంధించిన ప్రతినిధులే కావడంవల్ల స్వార్థ ప్రయోజనాల కోసం విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ పరిస్థితి కర్నాటక, సంయుక్త మహారాష్ట్రలకు లేదు. అందుకే, ఈ భూస్వామ్యవర్గ నాయకులే [తెలంగాణా సాయుధ పోరాట అగ్రగాములలో ఒకరైన భీమిరెడ్డి నరసింహారెడ్డి అన్నట్టుగా] "తెలుగుజాతి ఐక్యతకు వ్యతిరేకులుగాని తెలంగాణా ప్రజలు మాత్రం కార''నీ అప్పటికీ, ఇప్పటికీ రుజువవుతున్న సత్యం! అందుకే ఆలోచనాపరుడైన ఆనాటి శాసనసభ్యుడు ఎల్.ఎన్. రెడ్డి ఫజల్ ఆలీ కమీషన్ నివేదికను ప్రస్తావిస్తూ "ఈ కమీషన్ కూడా అటు పూర్తిగా విశాలాంధ్రకు మద్ధతు తెల్పకుండాను, ఇటు ప్రత్యేక తెలంగాణాకు వందశాతం అనుకూలంగా సిఫారసు చేయకపోవటం కూడా పరిస్థితిని క్లిష్టం చేసిందని చెప్పాలి'' అని వ్యాఖ్యానించవలసి వచ్చింది [02-04-1956]


సరిగ్గా ఈ అస్తుబిస్తు పరిస్థితులలోనే, తెలంగాణా గతంలో ఎప్పుడూ 'సర్ ప్లస్'' (మిగులు బడ్జెట్ తో) ప్రాంతం ఉండేదనీ, కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ 'సర్ ప్లస్' కాస్తా తెలంగాణాకు దక్కనివ్వకుండా కోస్తాలో ఖర్చుపెట్టారన్న అపవాదును కొందరు సోదర తెలంగాణా మిత్రులు ముందుకు నెడుతూ వచ్చారు. ఇంతకూ ఆ "కొందరు'' మాత్రమే పదేపదే పేర్కొంటున్న "తెలంగాణాకు ఉంటూ వచ్చిన సర్ ప్లస్ ఆదాయం'' ఎలా పేరుకుంది? ఎందుకు పేరుకుంది? అందుకు కారకులెవరు? ఒకవైపున తెలంగాణా ప్రాంతం నిజాంపాలన మూలంగా "దారుణమైన వెనుకబాటు తనా''న్ని అనుభవిస్తూ వచ్చిందని చెబుతున్నవారు, ఆ వెనుకబాటుతనాన్ని తొలగించడానికి నిధులు ఉపయోగించి ఉన్న పక్షంలో "సర్ ప్లస్'' బడ్జెట్ మిగిలేది కాదుగదా! ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి "ఆంధ్రప్రాంతం ఆదాయం తరుగులో'' ఉంది కాబట్టి, తెలంగాణాకి జమకూడుతూ వచ్చిన మిగులు ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దరిమిలా కోస్తావాళ్ళు మింగేశారన్న ఆరోపణ సరైనది కాదు! ఎందుకంటే వెనుకబాటుతనానికి రెండు ముఖాలుంటాయి : (1) ఉన్న మిగులును ఎలాంటి ప్రజాసంక్షేమ పథకాలకు ఖర్చు చేయకుండా ఉన్నందువల్ల, లేదా (2) సంబంధిత ప్రాంతంలో ప్రజాహిత పథకాలను అమలు జరగకుండా స్వార్థప్రయోజనాలను ఆశించే పాలకుల వల్లనూ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత, అంటే, 1956 నుంచి 2008 వరకూ కడచిన గత 56 సంవత్సరాలలోనూ విశాలాంధ్ర ఏర్పడిన తరువాత సోదర తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్నిరంగాలలోనూ [విద్య, వైద్య, పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల, వాహనాల పెరుగుదలలో, పారిశ్రామిక, వ్యవసాయక వగైరా రంగాలలో] సుమారు 130 శాతంనుంచి 300 శాతం దాకా అభివృద్ధి నమోదైనదని సాధికారిక గణాంకాలు నిరూపిస్తున్నాయి! వాటిని కాదని ప్రత్యామ్నాయ వాదనలతో వాస్తవాలతో వేర్పాటువాదులు ఇంతవరకూ ముందుకు రాలేదు. రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కొందరు వేర్పాటువాదులు "మాకు లెక్కలువద్దు, ప్రత్యేక రాష్ట్రం'' మాత్రమే కావాలన్న మొండివాదనకు గజ్జెకట్టారు! ఏ ప్రజాహితమైన పనులమీదా ఖర్చు చేయనప్పుడు, "రూపాయి ఖర్చుకాకూడదు, బిద్దమాత్రం దుత్తల్లే ఉండాలి'' అన్నట్టుగా "మిగులు బడ్జెట్'' మిగులుగానే ఉండక తప్పదుకదా! స్కూళ్ళు, కాలేజీలు, ఆస్పత్రులు, తదితర ప్రజాహిత పథకాలను నిజాం ప్రభువులు గ్రామసీమల అభివృద్ధికోసం ఖర్చుపెట్టకుండా ఉన్నందుననే ఆ మిగులు తేలింది; కాని తన భోగవిలాసాలకు మాత్రం కొదవలేదు!ఖర్చు చేయనప్పుడు ఒక చోట మిగులు మరొక చోట కొరతకు కారణమవుతుంది!


1956 నుంచి 2008 వరకూ తేలిన "అభివృద్ధి'' గణాంకాల ప్రకారం చూసినప్పుడు, తెలంగాణా "మిగులును'' కోస్తాఆంధ్రలో వాడేసుకున్న మాటే నిజమయితే, సోదర తెలంగాణలో 130 శాతంనుంచి సుమారు 300 శాతం దాకా అభివృద్ధి ఎలా సాధ్యమో "సర్ ప్లస్'' వాదులు వివరించగలగాలి! తెలంగాణా నాయకులలో ఒకరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను రెండవ ప్రపంచయుద్ధానికి ముందూ, ఆ తరువాతా (1939 నుంచి 1948 దాకా) పరిస్థితిని చర్చిస్తూ హైదరాబాద్ రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు క్రమంగా ఎలాంటి సంకతంలోకి వెళ్ళాయో వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు "తారుమారైపోయిన హైదరాబాద్ స్థితిగతుల''ను తన "50 సంవత్సరాల హైదరాబాదు'' గ్రంథంలో [''ఎమెస్కో'' ప్రచురణ : 2012] యిలా వివరించారు: యుద్ధానికి ముందు "గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ బడ్జెట్ మిగులుగానే ఉండేది. రాష్ట్రప్రభుత్వ ఆదాయపు పద్దులలో అంతవరకూ ఎలాంటి మార్పూ లేదు కూడా. కాని - దిగుమతి, ఎగుమతి వ్యాపారం సన్నగిల్లడం, రాకపోకల సౌకర్యాలు తగ్గటం వలన పరిస్థితులు కూడా చాలా తారుమారైనవి. (తెలంగాణాకు) బర్మానుంచి బియ్యం రావటంలేదు. కొన్ని జిల్లాల్లో క్షామపరిస్థితులు ఏర్పడటం వలన, రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నవి. తిండిగింజలలోటు ఏర్పడింది. ధరలు రోజుకు రోజు పెరుగుచుండెను. వస్తువులు మాయం కావటం ఆరంభమైనవి. దొంగబజారు, నిలవపెట్టడం, అక్రమ లాభాలు సంపాదించడమనే పరిభాష మొదటి పర్యాయం హైదరాబాద్ రాష్ట్రంలో వాడుకలోకి వచ్చేసినది. ఆ పరిభాష అలాగే ఇప్పటివరకూ (యుద్ధానంతరం వరకూ) నిలిచిపోయినది''!

అంతేగాదు, అంతవరకూ హైదరాబాద్ రాష్ట్రంలో "ఆదాయంపైన పన్ను అనే విధానేమే లేద''నీ, బ్రిటిష్ పరిపాలిత సికింద్రాబాద్ భాగంలో మాత్రం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ రెసిడెంట్, ఆదాయంపైన పన్ను వేశాడనీ, కాని హైదరాబాదులో మాత్రం ఆ పని చేయడం సులభం కాలేదనీ కూడా మందుముల రాశారు. ఈ సందర్భంలోనే ఆయన మన దేశీయ పాలకులను గురించి ఒక 'చెణుకు' విసిరారు " "మన దేశీయ  పాలకులు 20వ శతాబ్దంలో జీవిస్తూ 18వ శతాబ్దపు పరిభాషలో ఆలోచిస్తూ ఉంటార''ని! అక్షరసత్యం మరోమాటలో చెప్పాలంటే ఆదాయపుపన్ను లేని సమయంలో సమకూడిన "రెవెన్యూ మిగులు''ను చూసారు.


ఇటీవల మరొక గమ్మత్తు రాజకీయాన్ని కొందరు వేర్పాటువాద రాజకీయ నిరుద్యోగులు ఆశ్రయించారు! ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద ఆర్ధిక, ప్రణాళికా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమర్ధుడైన అధికారి బి.పి.ఆర్. విఠల్ కూడా తెలంగాణా "సర్ ప్లస్'' ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చుచేసిన పధ్ధతి గురించి తప్పుపట్టారని వేర్పాటువాదులు కొందరు ఉదాహరిస్తున్నారు. ఇందుకోసం, రాష్ట్ర సమైక్యతను సమర్థిస్తున్న విఠల్ కుమారుడైన ఆచార్య సంజయ్ బారును విమర్శించడం కోసం తండ్రీ-కొడుకుల వాదనల మధ్య తగాదా పెట్టాలని వేర్పాటువాదులు చూశారు. కాని బి.పి.ఆర్.. విఠల్ ఒకనాటి తెలంగాణా మిగులు (సర్ ప్లస్) ఆదాయం గురించి దఫదఫాలుగా "సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్'' అని ప్రచురించిన ["A state in periodic crisises : Andhra Pradesh''] గ్రంథంలో చర్చించన తీరువేరు, వేర్పాటువాదులు ఆ పేరిట చేస్తున్న వాదన వేరు! తెలంగాణా ప్రాంతంలోని సొంత ఆదాయవనరులకు సంబంధించిన "మిగులు''ను ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా వినియోగించలేదన్న ఫిర్యాదును ప్రస్తావిస్తూ విఠల్ చేసిన వ్యాఖ్య ఇక్కడ పరిశీలిచదగినది: "ఈ మిగులు రెవెన్యూలను అంచనా కట్టె పద్ధతీ, సదరు మిగుళ్ళను ప్రభుత్వం ఉపయోగించిన పద్ధతీ ఈ రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయాలలో దఫదఫాలుగా తలెత్తుతూ వస్తున్న సమస్యలు. అయితే, ఈ ప్రాంతీయ రాజకీయాలను అలావుంచి ఈ మొత్తం రెవెన్యూ మిగులు సమస్యను బడ్జెట్ రూపకల్పనకూ, రాజకీయాలకూ మధ్య ఒక సంబంధిత సమస్యగా అధ్యయనం చేయడానికి తగిన కేస్ స్టడీ'' కాగలదు! ఇంకా స్పష్టం చేయాలంటే - ఆర్ధిక సంబంధితమైన పాలనా వ్యవహారాలపైన శాసనవేదిక (లెజిస్లేచర్) అడుపాజ్ఞాలకు సంబంధించిన సమస్యగా దానిని అధ్యయనం చేయదగిన అంశం'' అని కూడా విఠల్ పేర్కొన్నారు! అంతేగాదు, ప్రాంతీయ రాజకీయాలనుంచి వివాదాలు తలెత్తి ఉండవచ్చు, కాని అంతమాత్రాన ద్రవ్య (ఆర్ధిక) పాలనకు చెందిన సమస్యల ప్రాధాన్యతనుంచి దృష్టి మళ్ళరాదనీ, ఇంతకూ మౌలికమైన సమస్యకు పునాది రాజకీయ ఒప్పందమనీ, ఇది రాజకీయ ఉద్యమం వల్ల మరింత జటిలమవుతుందనీ విఠల్ పేర్కొన్నాడు.


అధికారిగా ఆయన అంతకుమించి రాజకీయ నిరుద్యోగుల మాదిరిగా ముందుకు వెళ్ళలేడు! ఈ సమస్య చిలికి చిలికి గాలివానలాగా కేంద్రానికి, రాష్ట్రానికీ మధ్య సమస్యగా తలెత్తుతుందనీ, చివరికి దీనికి పరిష్కారమల్లా రాజ్యాంగ సవరణ మాత్రమేనానీ విఠల్ చెప్పారు. అందుకే ఒక రాజ్యంగబద్ధ సంస్థగా ఆంధ్రప్రదేశ్ శాసనసభే తెలంగాణా ప్రాంతీయ కమిటీని నాడు సాధికారికంగానే ఏర్పాటు చేసిందనీ, ఈ కమిటీ ఉన్నతకాలం, చట్టరీత్యా తనకు సంక్రమించిన అధికారాల పరిథిలో, ప్రభుత్వం చేసే ఖర్చుపైన చాలా శక్తిమంతంగా అర్థవంతంగా ఆజమాయిషీ చేస్తూ వచ్చిందని కూడా విఠల్ అన్నారు! ఈ కమిటీ ప్రస్తావించే సమస్యల వెనక రాజకీయ పూర్వరంగం ఉన్నప్పటికీ తెలంగాణా ప్రాంతీయ కమిటీ మాత్రం తన విశ్లేషణలో గాని, సమస్యను వివరించడంలో గానీ పక్కా వృత్తి సంస్థగానే వ్యవహరిస్తుందని విఠల్ అన్నారు! ఈ సమస్యను వివరిస్తూ విఠల్ గారు ఆరోపణలు చేసేవారినందరినీ ఒకగాటున కట్టకుండా ఏకీకరణ మూలంగా తెలంగాణా "రెవెన్యూ మిగులు''ను కోస్తాఆంధ్రులు వాడుకుంటారన్న ఆందోళనను "కొంతమంది తెలంగాణా నాయకులు'' వ్యక్తం చేశారని స్పష్టం చేయడం గమనార్హం. ఆ "కొందరు'' నాయకులు "అందరి నాయకుల''నీ కాదు, వారు మొత్తం తెలంగాణా ప్రజాబాహుళ్యం అభిప్రాయాలను ప్రతిబిందిస్తున్నారనీ అర్థం కాదు! ఇంతకూ ఆ 'సర్ ప్లస్'' ఆదాయం ఏది? తెలంగాణలో వసూలయ్యే భావిస్తూ, ఎక్సైజ్ (ఆబ్కారీ) ఆదాయమూ. ఇది ఏడాదికి రూ.5 కోట్లు, ఆనాటికి రాష్ట్రాల పునర్వవస్థీకరణ (ఫజల్ ఆలీ) కమిటీ రాష్ట్రంగా ఏర్పడిన "ఆంధ్రరాష్ట్రం కొంతమేర ఆర్ధిక సమస్యను ఎదుర్కొంటూ వచ్చింద''నీ చెప్పిందేకాని ఆ "కొంత'' ఎంతో స్పష్టం చేయకుండా వదిలేసి కూర్చుంది! అలాగే మద్రాసునుంచి విడిపోయి ఏర్పడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రంలో "తలసరి ఆదాయం తక్కువ''ని చెప్పిందేగాని, ఆ "తక్కువ'' ఎంతో గణాంకంలో తెలపకుండా చల్లగా జారుకుంది! కాని అనుమానాలు మిగిల్చి రెండు ప్రాంతాల మధ్య మనస్సులను చెడగొట్టడానికి ప్రయత్నించింది, ఇక "పెద్దమనుషుల ఒప్పందా''న్ని అమలు జరిపించుకునే బాధ్యతనుంచి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని తెలంగాణా మంత్రులు తప్పుకుని పదవులను మాత్రం అనుభవిస్తూ వచ్చారు!



- [ మరిన్ని వివరాలు వచ్చే వ్యాసంలో]

షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?

జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు.  జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.   దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే..  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.  ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.  అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు.   కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.  అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు. 

మూడో విడతలోనూ ‘హస్తం’దే పై చేయి!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు దశల్లోనూ కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మూడో దశలో 4,158 స్థానాల్లో ఎన్నికలు జరగగా, 2,286 పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.  మూడు దశల్లో కలిపి 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, కొన్ని మినహా అన్ని స్థానాల్లో ఫలితాలు వచ్చాయి. వీటిలో 7,093 పంచాయతీల్లో  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 3,488   స్థానాలలో విజ యం సాధించి బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచి ఉనికి చాటుకుంది.  బీజేపీ 699  స్థానాలలో గెలిచి నామమాత్రపు ప్రభావాన్ని చూపింది.   అదలా ఉంటే మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు. ఇతరుల్లో సీసీఐ మద్దతుదారులు 24 , సీపీఎం 7 స్థానాలలో విజయం సాధించారు. మూడో విడత ఎన్నికల్లో సిద్దపేట మినహా మిగిలి30 జిల్లల్లోనూ  కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది.  కాగా,  పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల తర్వాత అత్యధిక స్థానాలు దక్కించుకున్నది స్వతంత్రులే. స్వతంత్రులే సుమారుగా 10శాతం సీట్లను గెలుచుకున్నారు. అయితే అలా గెలిచిన వారిలో   80 శాతం మంది కాంగ్రె‌స్ రెబల్సే కావడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులూ ఈ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి పనిచేయడం సత్ఫలితాలను ఇచ్చింది. మూడో విడత పంచాయతీ పోలింగ్ లోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.  మూడో విడతలో 85.77 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే ఇది   0.9 శాతం తక్కువ. కాగా మూడు విడతలూ కలిసి మొత్తం 85.30 శాతం ఓటింగ్ నమోదైంది. చివరి మూడో విడతలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92. 56 శాతం ఓటింగ్ జరగగా,  నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76.45 శాతం పోలింగ్‌  జరిగింది. ఇలా ఉండగా నూతనంగా ఎన్నికైక సర్పంచ్ లు  ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా ప్రకటించిన మేరకు డిసెంబర్ 20న ముహూర్తం మంచిగా లేదంటూ ఎన్నికైన సర్పంచ్ లు తెలపడంతో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 22కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.20న ముహూర్తం సరిగా లేదని కొత్తగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు కోరడంతో ప్రభుత్వం తేదీని మార్చినట్లు తెలిపింది.

మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం

  తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది. మూడోవంతు సర్పంచ్ స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ కలిపినా 30 శాతం కూడా దాటలేదు. మొత్తం 4,158 స్థానాల్లో ఎక్కువ చోట్ల గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు.  రాత్రి 8 గంటల వరకు కాంగ్రెస్‌ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1850, బీఆర్ఎస్ 960, బీజేపీ 180, ఇతరులు 390 సర్పంచ్‌ స్థానాల్లో గెలు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం, గుండ్లరేవు గ్రామంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గుండ్లరేవు గ్రామంలో మూడో దశలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్ ఇద్దరు వ్యక్తులు పోటీ చేశారు. ఏపీ రాజకీయ నాయకుల పేర్లతో వీరి పేర్లు ఉండటంతో గ్రామంలో ప్రచారం కూడా ఆసక్తికరంగా జరిగింది. వారి ప్రచారం కూడా 'చంద్రబాబు', 'జగన్' పేర్లతోనే ఎక్కువగా సాగింది. ఈరోజు జరిగిన పోలింగ్‌లో బానోత్ జగన్‌పై భూక్యా చంద్రబాబు విజయం సాధించారు. దీంతో 'జగన్‌పై చంద్రబాబు విజయం' అంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది  

ఉపఎన్నికలకు భయపడే అనర్హత వేటు వేయడం లేదు : కేటీఆర్

  అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. "స్వంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని మండిపడ్డారు. ఉప ఎన్నికల భయంతోనే వెనకడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు  అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మేరకు స్పీకర్  కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికంగా అడ్డుపెట్టుకుని గోడ దూకిన ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ సంబరపడినా, ప్రజాక్షేత్రంలో వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.

పులివెందులలోనూ కదులుతున్న వైసీపీ పునాదులు!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వాస్తవానికి గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వైసీపీ నుంచి వేగంగా వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నాయకులు, జగన్ సన్నిహితులు కమలం గూటికి చేరారు. ఇలా ఉండగా ఎవరెలా వెళ్లిన కడప, మరీ ముఖ్యంగా పులివెందులలో వైసీపీ బలంగా ఉందన్న అభిప్రాయం ఇంత వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే పులివెందుల జడ్డీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ కనీసం డిపాజిట్ కూడా నోచుకోకుండా ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పుడే పులివెందులలో వైసీపీది వాపేనా, బలం కాదా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత పులివెందుల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీయులు, నియెజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరడం కూడా పులివెందులలో వైసీపీ బలం సన్నగిల్లిందనడానికి తార్కానంగా నిలిచింది. ఇక తాజాగా జగన్ సన్నిహితుడు,    వేంపల్లిలో వైసీపీ కీలక నేత అయిన చంద్రశేఖరెడ్డి అలియాస్ దిల్ మాంగే వైసీపీకి గుడ్ బై చెప్పి బీటెక్ రవి సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. ఆయనతో పాటు వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వేంపల్లిలో వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి చేరిక కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా పాల్గొన్నారు.  ఈ పరిణామంతో పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ పతనం ప్రారంభమైనట్లేనని అంటున్నారు.  

ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాదరావు బుధవారం (డిసెంబర్ 17) కీలక తీర్పు వెలువరించారు.  ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిందని చెప్పడానికి సాక్ష్యాధారాలు నమోదు కాలేదని పేర్కొంటూ అనర్హత పిటీషన్లను స్పీకర్ గడ్డం ప్రసాదరావు డిస్మస్ చేశారు. బుధవారం ఆయన ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తీర్పు వెలువరించారు.  2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.  బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడికి గాంధీకి సంబంధించిన అనర్హత పిటీషన్లను డిస్మిస్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాదరావు తీర్పు వెలువరించారు. కాగా సుప్రీంకోర్టు ఈ నెల 17వలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాదరావు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై తీర్పు వెలువరించారు.  

కాంగ్రెస్, బీజేపీల్లో లీకు వీరులు.. హరీష్, కేటీఆర్ కు చేరుతున్న కీలక సమాచారం!

తెలంగాణ పారిశ్రామిక విధానంపై  రేవంత్ సర్కార్ ఇలా అనుకుందో లేదో.. అది విషయం అలా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్ కి చేరిపోయింది. ఇవేం లీకులురా బాబూ అంటే రేవంత్ సర్కార్ ఒక్క‌సారి  ఉలిక్కి ప‌డింది.   ప్ర‌భుత్వ అధికార గ‌ణంలో.. మ‌రీ ముఖ్యంగా  స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా?  అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.   అలాగే  మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు చేసిన కోవ‌ర్ట్ కామెంట్ కూడా బీఆర్ఎస్ కు పార్టీలో ఉన్న లీకు వీరుల సంగతిని ప్రస్ఫుటం చేసింది. ఇంతకీ మైనంపాటి ఏమన్నారంటే..   రాష్ట్రం సంగ‌తేమో తెలీదు కానీ, మెద‌క్, సిద్ధిపేట ప‌రిస‌ర‌ప్రాంతాల‌లో  హ‌రీష్ రావు ప్ర‌భావం చాలా చాలా ఎక్కువ‌గా ఉంద‌నీ,    ఒక మాట మన నోటి నుంచి ఇలా వచ్చిందో లేదో.. అలా హరీష్ కు చేరిపోతుందని బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు.   ప్ర‌భుత్వ అధికారుల్లోనూ హ‌రిష్ ఫాలోయ‌ర్స్,  మద్దతు దారులు బలంగా ఉన్నారన్న అభిప్రాయమూ కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.  దీనిపై కూడా మైనంప‌ల్లి  బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కోవ‌ర్ట్ నెట్ వ‌ర్క్ న‌డుపుతున్నా,  ఎప్ప‌టిక‌ప్పుడు కాంగ్రెస్ లీడ‌ర్లు, ఇత‌ర‌ ప్ర‌భుత్వ స‌మాచారం వారికి చేరిపోతున్నా..  ప్ర‌జ‌లు మాకు ప‌ట్టం క‌ట్టి  గెలిపిస్తున్నారన్నారు  మైనంప‌ల్లి.  అయితే ప్రభుత్వ సమాచారం ప్రతిపక్షానికి లీక్ కావడమన్నది ఎంత కాదనుకున్నా ఇబ్బందేనని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.  అయితే ఆ లీకులు ఒక్క రేవంత్ సర్కార్ కే పరిమితం కాలేదనీ, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీలోనూ ఉన్నాయనీ వెల్లడైంది. కమలం పార్టీలోనూ లీకు వీరులున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీతో తమ భేటీ లో ని అంశాలన్నీ లీకయ్యయని కిషన్ రెడ్డి లబోదిబో మన్నారు. ఇలా లీకులు చేసే వారు మెంటల్ గాళ్లంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా ప్రధాని  మోడీ.. సోష‌ల్ మీడియాలో మీక‌న్నా అస‌దుద్దీన్ ఓవైసీ  న‌యం అన్నారు. ఆ మాట బయటకు వచ్చేసింది. మోడీ అక్షింతలతో రాష్ట్ర బీజేపీ నేతల పరువు సగం పోయింది. మోడీ వ్యాఖ్యలు లీక్ అయ్యి బయటకు రావడం, ఆ లీకు వీరుల పని పడతామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో చెప్పక తప్పని పరిస్థితి రావడంతో రాష్ట్ర బీజేపీ పరువు పూర్తిగా పోయినట్లైంది. మొత్తం మీద అధికారంలో లేకున్నా ట్యాపింగ్ వంటి  దారులలో స‌మాచార సేక‌ర‌ణ చేయ‌డానికి వీల్లేకున్నా కూడా హ‌రీష్, కేటీఆర్ కి చేరాల్సిన  స‌మాచార‌మైతే చేరిపోతోంద‌న‌డానికి  ఎటువంటి సందేహం అవసరం లేదు.   

హస్తినలో తెలంగాణ సీఎం.. కేంద్ర మంత్రులు, సోనియాతో భేటీలతో బిజీబిజీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారానమ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొల్పనున్న 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సహకారం అందించాలని కోరారు.  వీటి ద్వారా ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా నాలుగు లక్షల మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు.  వీటి నిర్మాణం,   ఇత‌ర విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు దాదాపు 30 వేల కోట్ల రూపాయలు అవసరమౌతాయని తెలిపిన ఆయన వీటి ఏర్పాటు కోసం తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని కోరారు.   అదే విధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయిన సీఎం రేవంత్.. ఆ సందర్భంగా  హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాల‌ని విజ్ణప్తి చేశారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని గుర్తించామని తెలియజేశారు. అలాగే అవసరమైతే వెంటనే తరగతులు ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీగా ఉందని తెలిపారు.  ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తే.. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉ:దన్నారు.  అదే వి ధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా తొమ్మది కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహార్  నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఇతర వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ కు తెలిపారు రేవంత్ రెడ్డి.   ఇక పోతే కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గంధీతో  సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తెలంగాణలో ఈ నెల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వివరాలను తెలిపారు. అలాగే..  తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2024ను సోనియాకు అందజే శారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో గత రెండేళ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను రేవంత్ ఈ సందర్భంగా సోనియాగాంధీకి వివరించారు.  ఈ సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ పాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో  రేవంత్ రెడ్డి దూరదృష్టిపై సోనియాగాంధీ అభినందించారు.   

ఐడీపీఎల్ ల్యాండ్స్‌పై విజిలెన్స్ విచారణ

హైదరాబాద్ లోని ఐడీపీఎల్  భూముల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాదాపు నాలుగు వేల  కోట్ల రూపాయల విలువైన భూములపై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ విచా రణకు ఆదేశాలు జారీ చేసింది. కూకట్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 376లో జరిగిన లావా దేవీలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత  ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.   ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడు భూకబ్జాలకు పాల్పడ్డారని కవిత ఆరోపించగా,  మాధవరం కృష్ణారావు కవిత భర్త అనిల్‌పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో  ప్రభుత్వం ఈ భూముల అసలు యాజమాన్యం, గతంలో జరిగిన లావాదేవీలు, అక్రమ కబ్జాల అంశాలపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించింది.   ఈ విచారణలో  కబ్జాదారులు ఎవరన్నది తేలితే   వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం స్పష్టం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ వివాదం రాజకీయంగా సంచలనంగా మారగా, విజిలెన్స్ విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు.