అబద్ధాలకు తెరతీసిన "వేర్పాటు''!

- డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

అబద్దాల నోటికి అరవీసెడు సున్నం కొట్టినా చాలదట! ఊదర ద్వారా ఏ ఉద్యమాలూ నిలవవు; ఊదర వల్ల ఉద్యమాలకు అస్తిత్వం రాదు. ప్రజలకు, దేశానికి, రాష్ట్రాలకు 'అసిత్వం' అనేది సామాజిక, ఆర్థికరంగాలలో పాలనావ్యవస్థలు ప్రజానుకూలమైన, ప్రణాళికాబద్ధమైన, ద్వంద్వప్రమాణాలకు తావులేని పథకాలను ఆచరణలో జయప్రదంగా అమలు జరిపినప్పుడు మాత్రమే స్థిరపడుతుంది. ఆ ప్రగతి ప్రజాతంత్ర విప్లవం ద్వారా మాత్రమే ప్రజాబాహుళ్యం అనుభవంలోకి వస్తుంది. ప్రజలకు సామాజిక, ఆర్థికస్థిరత్వం అప్పుడు మాత్రమే సాధ్యం. అలాంటి స్థిరత్వం ద్వారానే జాతికీ, దేశానికీ, రాష్ట్రాలకూ ఆత్మగౌరవం సిద్ధిస్తుందిగాని పదవీ ప్రయోజనాల కోసం రాజకీయ నిరుద్యోగులు ప్రారంభించే ఊదర ఉద్యమాల వల్ల ఎంతమాత్రం సంప్రాప్తించదు! పరిణామాలకు చెప్పే వక్రభాష్యాలవల్ల, ఆడే అబద్దాలవల్లా ప్రాంతాలకు స్థిరత్వంగానీ, ప్రజలకు ఆత్మగౌరవంగానీ సమకూడదు. ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోని మోతుబరులకూ, చీలికవాదం చాటున, సమైక్యతా వాదం చాటునా దాచుకుంటున్న స్వార్థపరులందరికీ సమంగానే వర్తిస్తుంది.



ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, అటూ యిటూ కూడా కృత్రిమంగా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ పేరుకు మాత్రమే 'మేథావులు'గా చెలామణి కాజూస్తున్న కొందరు కుహనా విద్యాధికులూ పలుకుతున్న అబద్ధాలు! ఈ మోతుబరులు, ఈ విద్యాధికులలో హెచ్సుమంది అటుయిటూ కూడా ప్రాంతాలలోనూ తరతమ భేదాలతో, ఆంధ్రప్రదేశ్ (విశాలాంధ్ర) రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎదిగివచ్చిన నయా (నియోరిచ్) సంపన్న వర్గాలేనని మరచిపోరాదు. వీరిలో ఒక ప్రాంతంలోని మోతుబరులకు దేశానికి స్వాతంత్ర్యం రాక ముందునుంచీ ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగుసీమలోని ఒక ప్రాంతం ఉన్నప్పుడే కొంత ఆర్థికస్తోమత సమకూడి ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగువారు వేరై ఆంధ్రప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఈ సంపన్నవర్గం మరింత బలపడుతూ వచ్చింది. ప్రారిశ్రామికంగానూ, వ్యవసాయకంగానూ. కాని ఈ మోతుబరుల 'బలాన్ని' చూపి ఆంధ్రప్రాంతంలోని నూటికి తొంభైమంది ప్రజాబాహుళ్యం స్థితిగతులన్నీ మెరుగైపోయినట్టు భావించరాదు; జల సమస్యలు ముగింపునకు వచ్చినట్టూ భావించరాదు.

 


అలాగే బ్రిటిష్ వలసపాలకుల అండతో హైదరాబాద్ కేంద్రంగా నిజామాంధ్రలోని తెలుగుప్రజలపైన దారుణమైన నిరంకుశ పాలనను సాగిస్తూ తెలుగుప్రజల్ని తెలుగు పాఠశాలలు పెట్టుకోనివ్వకుండా ఉర్దూను మాత్రమే పాలనా భాషగానూ రుద్ది, స్వభాషా సంస్కృతులకు దూరంచేసి, దొరల, జాగిర్దార్ల, దేశ్ ముఖ్ ల దౌర్జన్యాలను అనుమతించడం ద్వారా నిజాంసర్కార్లు [ఒక్క కుతుబ్ షాహీ మినహా] ప్రజల్ని వెట్టిచాకిరీకి తాకట్టుగా మార్చాయి! ఆ పరిస్థితుల్లో అక్కడ నిజాంకు తాబ్ దార్లుగా మారిన ఏ కొలదిమంది దొరలూ, జాగిర్దార్లూ మాత్రమే సంపన్నులుగా చెలామణీ అయ్యారు. కాని, మెజారిటీ తెలంగాణా తెలుగుప్రజలను నిజాముతోపాటు తెలుగుదొరలూ, తెలుగు జాగిర్దార్లూ, తెలుగు పటేల్, పత్వారీలూ దారుణ దోపిడీ ద్వారా పీల్చుకుతిని పిప్పిచేసి 'నీ బాన్చని దొరా, నీ కాల్మొక్తా' అన్న బానిసవ్యవస్థకు బందీలు చేసి వదిలారు. ఒక్క తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం [ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సాహస నాయకత్వంలో] మాత్రమే ఏకభాషా సంస్కృతులు ఆధారంగా ఉభయ ప్రాంతాలలోని తెలుగువారినందరినీ ఏకోన్ముఖం చేసి విశాలాంధ్ర ఏర్పాటుకు భౌతిక, మానసిక పునాదుల్ని పటిష్టం చేసింది. అయితే అంతకుముందు ఆంధ్రరాష్ట్రావతరణ తర్వాత ''నియోరిచ్'' కోస్తాంధ్రలో ఎలా తలెత్తిందో, ఇటు విశాలాంధ్ర అవతరణ తర్వాత మన తెలంగాణా ప్రాంతంనుంచి కూడా "నయాసంపన్నవర్గం'' తలెత్తింది. అంతకుముందెన్నడూ లేని స్థాయిలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత కోస్తాంధ్ర ప్రాంతాల నుంచి విద్యా, వ్యాపారరంగాల నుంచి ఎలా గణనీయమైన సంఖ్యలో "విదేశీ భారతీయులు''గా (ఎన్.ఐ.ఆర్.లు) ఎదుగుతూ వచ్చారా, అలాగే మన తెలంగాణానుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాతనే ఎన్.ఐ.ఆర్.ల సంఖ్యా నానాటికీ పెరుగుతూ వచ్చింది. ఈ పరిణామం ప్రధానంగా పరాయిపాలన నుంచి విడివడి, ఉభయప్రాంతాలలోని తెలుగువారంతా 'విశాలాంధ్ర' (ఆంధ్రప్రదేశ్)గా ఏర్పడిన తరువాతనే జరిగిందని మరచిపోరాదు!


 

అయితే అటూ, యిటూ కూడా సామాన్య ప్రజాబాహుళ్యానికి సమష్టిగా దక్కవలసిన రాష్ట్ర సహజవనరులు అందుబాటులోకి వచ్చాయని కలలో కూడా భావించకూడదు! ఈ సహజవనరులపై పెత్తనం కోసం ఉభయప్రాంతాలలోని మోతుబరుల మధ్య పెరుగుతూ వచ్చిన స్ఫర్ధలే, ప్రజాబాహుళ్య ప్రయోజనాలతో సంబంధంలేని వ్యర్థ ఉద్యమాల రూపంలో దఫదఫాలుగా తలెత్తుతూ రాష్ట్ర ప్రజల మూల్గులను పీల్చి వేస్తున్నాయి, ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ సమయంలో వామపక్షాలు సహితం ప్రజలకు నాయకత్వం వహించి వాస్తవాలను బోధించి సమీకరించడంలో విఫలమవడం ప్రజలపాలిట 'శాపం'గా మారి, మోతుబరులకు, వారి పాలకశక్తులకూ పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ అండదండలు అందించినట్టయింది! ఇందుకు ప్రధాన కారణం - విభేదించే విధానాలు చెప్పుకోదగినవి లేకపోయినా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలుబాటలలో యింకా ప్రయానిస్తూండటమే! ప్రజల్ని సరైన పంథాలో చైతన్యవంతుల్ని చేయడంలో తరచుగా విఫలమావుతూండటంవల్లనే ప్రజాతంత్ర ఐక్యసంఘటిన నిర్మాణంలో కూడా క్రియాశీల పాత్ర వహించలేకపోతున్నారు; ఐక్యప్రజాతంత్ర ఉద్యమాలు నిర్మించుకోడానికి ముందు ఉభయకమ్యూనిస్టు పార్టీలు [సి.పి.ఐ.-సి.పి.ఎం.] ఏకమై తిరిగి ఒక పార్టీగా అవతరించడం అవశ్యం జరగాల్సినపని. తెలంగాణా ఏర్పాటువాదం తలెత్తడానికి, ఎలాంటి శాస్త్రీయలక్ష్య నిర్వచనా లేకుండా కొందరు రాజకీయ నిరుద్యోగులు తలపెట్టిన ఉద్యమానికి కమ్యూనిస్టుపార్టీల ఉదాసీనత, నిర్వ్యాపార స్థితియే కారణం. అందువల్లనే రకరకాల అబద్ధాలకు వేర్పాటు ఉద్యమకారులు గజ్జెకడుతున్నారు; ఉభయప్రాంతాలలోని స్వార్థపర సంపన్నులూ, రాజకీయ నిరుద్యోగులూ భిన్నకోణాల నుంచి తెలుగుజాతిని విచ్చిన్నం చేయడానికైనా సిద్ధమేగాని పరాయి పాలకులనుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న 'విభజించి-పాలించే' సూత్రాన్ని వదులుకోడానికి మాత్రం వదులుకోడానికి సిద్ధంకావటంలేదు!



 

కనుకనే అనేక అబద్ధాలను ప్రచారంలో పెట్టడానికి వీరిలో కొందరు వెరవడం లేదు. ఉదాహరణకు తెలంగాణాలో ఒక మోతుబరి ఇటీవల కాలంలో నెలకొల్పిన ఒక స్థానిక దినపత్రిక - కేంద్రప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానవర్గం రాష్ట్ర విభజన సమస్యపై యింకా ఎలాంటి అవకాశవాద నిర్ణయానికి సిద్ధం కాకపోయినా, "వీర తెలంగాణా'' బదులు వేరు తెలంగాణాను ప్రమోట్ చేయడానికి, రాణి 'విజయాని'కి వచ్చినట్టుగా రంగుపులిమి "జజ్జనకర జనారే - తెలంగాణా ఖరారే'' అంటూ పతాకశీర్షిక పెట్టేసింది. అలా పెట్టడంలో ఉద్దేశ్యం, దాదాపు 800-900 మంది తెలంగాణా ఎస్.సి., ఎస్.టి., బి.సి. తదితర బడుగుబలహీన వర్గాల బిడ్డల్ని తమ రాజకీయ స్వార్థం కోసం బలిపశువుల్ని చేసి ఆత్మహత్యలవైపు పురిగొల్పిన పాపాన్ని మరోరూపంలో కడిగేసుకోడానికి చేస్తున్న తెలంగాణా ప్రయత్నం తప్ప మరొకటి కాదు. తెలంగాణా ''ఖరారే'' అన్నప్పుడు, ప్రత్యేకరాష్ట్రం ఆచరణలో నిర్ణయాత్మకంగా ఖరారైన తరువాత మాత్రమే వాడవలసిన పదం. అంతేగాని, "ఖరారు'' కాకుండానే వాచా 'విజయోత్సవం' జరపడం కనీవినీ ఎరగని పోకడ! కాని పత్రికాధిపతి ఆత్మ‘విశ్వాసం’తో మాత్రమే ‘ఖరార’యిన ‘విజయం’ ఎలాంటిది? అదే స్థాయి పత్రిక మాటల్లో ‘‘హస్తిన (ఢిల్లీ)లో కసరత్‌ ముమ్మరం’’ ఎలా అంటే? కోర్‌ కమిటీ నుంచి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి, అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి ఆ పిమ్మట రాష్ట్రపతిని నివేదన, ఆదరిమిలా రాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయం చేయకుండా చర్చకు పరిమితం కావటం, ఆ తరువాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, రాజ్యాంగ సవరణకు మూడింట రెండువంతుల మెజారిటీ అవసరం కాబట్టి, బిల్లు ‘నామ్‌కేవాస్తే’గా రూపొండం.. ఇలా ఎన్నో ‘సంకేతాల’ట! ఇలా ఊహాగానాలనే తెలంగాణా రాష్ట్రం వచ్చేసిందన్న ‘సంకేతాలు’గా మార్చడానికి జరిగిన ప్రయత్నం! ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తెచ్చి, తెలిసో తెలియకో తెలిసినట్టు నటించడం ద్వారా మరో అబద్ధానికి తెర ఎత్తుతోంది ఆ పత్రిక ఎలా?. ''ఆంధ్రప్రదేశ్‌ విభజన అనివార్యం! తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తథ్యం! వరుస పరిణామాలు ఇస్తున్న విసృష్ట సంకేతాలివి!



 

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడే సమయంలో ముఖ్యమంత్రిగా వుండి, విభజన ఆనుపానులు తెలిసిన నేత దిగ్విజయ్‌సింగ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించడం మొదలు... స్వరం మార్చుకున్న కరడుగట్టిన తెలంగాణా వ్యతిరేకులు..!! ఇలా అబద్ధాల బిఠా ఆ పత్రిక వర్ణించింది. అంతగారు, అంతకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన గులామ్‌ నబీ అజాద్‌ స్థానంలో దిగ్విజయ్‌సింగ్‌ ‘‘నియామకమే తొలి అడుగ’’ని మహా ‘విశ్వసం’తో రాసేసింది. కాని రాష్ట్ర పర్యాటనలో ఇటు దిగ్విజయ్‌సింగ్‌గాని, అటు అజాద్‌గాని పలు ప్రకనల మధ్యనే విభజన ‘అనుభవాల’గురించి ఏమి చెప్పాలోమాత్రం ఆ పత్రిక వెల్లడిరచకుండా దాచిపెట్టింటి! బిజెపి`ఎన్‌డిఎ పరివార్‌ కేంద్ర ప్రభుత్వం మాధ్యప్రదేశ్‌ను బలవంతంగా విచ్చిన్నం చేసి ఛత్తీస్‌ఖడ్‌ రాష్ట్రాన్ని ఏర్పరచడం వల్ల తామెన్ని కష్టనష్టాలకు గురయ్యామో దిగ్విజయ్‌సింగ్‌ మన రాష్ట్ర పర్యటనలోనే మనకు గుర్తు చేయాల్సివచ్చింది! ‘యథాతథంగా  సమైక్యరాష్ట్రంగానే ఆంధ్రప్రదేశ్‌ను కొనసాగించినా అందుకు రాష్ట్రనాయకులంతా కట్టుబడి ఉండాల్సిందే’’నని కూడా ఆయన హెచ్చరించి పోయాడు! అంతేగాదు ‘‘రాష్ట్ర విభజన అనేది చాలా క్లిష్టమైదీ, బాధాకరమైనదీ, ఆ బాధేమిటో నేను స్వయంగా అనుభవించాను. అందువల్ల రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ వ్యవహారం కాదు సుమా! మధ్యప్రదేశ్‌ విభజన జరిగినప్పుడు విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటే, వాడకందార్లందరూ మధ్య ప్రదేశ్‌లో ఉండిపోయారు...’’ అన్నారు దిగ్విజయ్‌సింగ్‌!



 

అలాగే అజాద్‌ కూడా లడఖ్‌ విభజన వల్ల మూడు జిల్లాలుగా కాంగ్రెస్‌ అన్ని సీట్లు గెలుస్తుందనుకుని విభజించనా కాంగ్రెస్‌ పూర్తిగా వోడిపోయిందని వాపోయాడు! వేర్పాటు వాదులకు అదీ ‘పరగడపై’పోయింది! ఇక పంజాబ్‌ విభజనవల్ల పంజాబ్‌ హర్యానా ప్రజలు ఇరువర్గాలూ ఘోరమైన ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ప్రసిద్ధ పాత్రికేయుడు కులదీప్‌నయ్యర్‌ మాటనూ ఆ పత్రిక మరిచిపోయి అబద్ధాలు అల్లడం విచారకరం! 'వేర్పాటు’వాదం చేసే రాజకీయ నిరుద్యోగుల్లో ఒకరు ఇప్పటిదాకా కేంద్రం ప్రకటన ఎందుకు రాలేదన్న పశ్నకు సమాధానంగా ‘ఎబ్బే‌, రాబోయే 122 రోజుల్లో వస్తుంద’ని చెప్పగా, ‘కాదు, కాదు 145 రోజుల్లోనే (ఇంకా అయిదు నెలలకట, అంటే డిసెంబర్‌నాటికి, అంటే 2014 ఎన్నికలకు మరో ‘గాలం’) ప్రకటన రాబోతోంద’ని మరొకరూ, ఇదీ అదీగారు, రానున్న 215 రోజుల్లోనే అంటే అంటే 2014 ఫిబ్రవరికల్లా (అంటే ఇదీ 2014 ఎన్నికలకు వేసిన గాలమే) ప్రత్యేకరాష్ట్ర ప్రకటన వెలువడుతుందని ఇంకొకరూ ఎవరికితోచిన ‘బుద్ధి’తో వారు ఉబుసుపోని ప్రకటనలు చేస్తూ యువకుల ఆత్మహత్యలకు బాధ్యత నుంచి తప్పించుకునే నానారకాల ‘పారుమాటలూ’చెబుతున్నారు!


 

అయితే ఇదే సందర్భంలో తెలంగాణాను ‘సీమాంధ్రులంతా దోచుకు తింటున్నార’ని బాహాటంగా మొత్తం ప్రజల్ని దోపిడీ దార్లుగా చిత్రించుతూ తెలంగాణా నుంచీ, హైదరాబాద్‌ నుంచీ టోకుగా ‘బంగీ కట్టి, కోస్తాంధ్రకు తోలేస్తామ’ని విషప్రచారాన్ని గత అయిదేళ్లుగా నిర్వహించిన తెలంగాణాలోని ‘బొబ్బిలి’వలసదారు నడమంత్రపు సిరిదారుడైన కె.సి.ఆర్‌, అతనికి అండగా నిలచిన ఆచార్యకోదండరామిరెడ్డి ఇప్పుడు గొంతులు మార్చారు! ఎందుకు? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై వారికి అనుమానం వచ్చే బహుశా, గొంతులు మార్చారు. తమ‘పోరాటం’ తెలంగాణాను దోచుకునే ‘సీమాంధ్ర పెట్టుబడి దారులపైన’నే గాని సీమాంధ్ర ప్రజలపై కాదనీ, ‘‘సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్ర రాజకీయ పెత్తందార్ల పేరిట కృత్రిమ కుట్రల ఉద్యమం’అనీ వీరు గొంతు సవరించుకునే పరిస్థితి ఏర్పడిరది. ఇప్పటికైనా గొంతుకు తెచ్చుకున్న ‘సవరణ’మంచిదేగాని, అసలు ఒక్కటిగా ఉన్న తెలుగు జాతి ఎందుకు విడిపోవాలో వీరు సూటిగా సమాధానం ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు! తెలంగాణా ప్రజల్ని కోస్తాంధ్రుల న్యూనపరుస్తున్నారనీ, తెలంగాణా సాహిత్యాన్ని ‘దూషిస్తూ’న్నారనీ తెలంగాణా  సంస్కుతిని భ్రష్టు పట్టిస్తున్నారనీ తెలంగాణాను దోచుకోవడం ద్వారా కోస్తాంధ్రులు తెలంగాణాను ‘బికారి’గా మార్చారనీ, ‘అభివృద్ధి’ని కుంటుపర్చారనీ - ఇలా గణాంకాలతో, భౌతిక వాస్తవాలతో నిమిత్తంలేని వాదనలు చేస్తూ వచ్చారు.

 

సోదర తెలంగాణా ప్రజల్ని ఇంతకాలం న్యూనపరుస్తూ వచ్చిన ‘ఉద్యమ’నాయకులపై రాజకీయ నిరుద్యోగులే, గతంలోనూ ఇప్పుడూ మంత్రిపదవుల్లో ఉన్న తెలంగాణా నాయకుల్ని ‘దద్దమ్మలు, బలహీనుల’’నీ బహాటంగా ఆడిపోసుకుంటూ వచ్చింది కె.సి.ఆర్‌ ప్రభృతులే, చివరకు కాంగ్రెస్‌కు ఉద్యమాన్ని తాకట్టుపెట్టి, తానుగా ఆ ‘బలహీనుల’ జాబితాలో చేరిందీ కె.సి.ఆర్‌కి తెలంగాణా మిత్రులు కొందరు, తెలంగాణా  రాష్ట్ర ఏర్పాటును అభిలషిస్తున్న మిత్రులూ కొలది రోజుల నాడు ఏ సీమాంధ్ర పత్రికలోనూ కాదు, స్థానిక పెట్టుబడిదారుడైన రాజాం అధిపతిగా ఉన్న ‘నమస్తే తెలంగాణా’లో ప్రచురించిన వ్యాసంలో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత మన తెలంగాణాలో జరిగిన అభివృద్ధి గురించి రాసిన మాటలు సహృదయంతో పరిశీలించండి. సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న తెలంగాణా మిత్రులు డాక్టర్‌ ఓం ప్రసాద్‌గద్దె ఆ పత్రికలో ‘విభజన.. వ్యతిరేకుల వితండవాదాలు’’ అన్న మకుటం కింద తెలంగాణాలో విశాలాంధ్ర ఏర్పడిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి జరిగిన యిలా పేర్కొన్నారు.

 

‘తెలంగాణాలోని మారుమూల పల్లెలు సైతం ప్రభుత్వ పథకాలతో అభివృద్ధిబాటన నడుస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నది. అలాగే, తెలంగాణాలో పట్టు సాధించిన నక్సలైట్లను నిర్మూలించేందుకు ప్రభుత్వమూ, పోలీసులూ తీసుకున్న ప్రత్యేక చర్యలతో మావోయిస్టులు ప్రభావం కోల్పోయారు. ఒకప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న తెలంగాణా పల్లెలు ఇప్పుడు అలాగే లేవు. ఇప్పుడు తెలంగాణా గ్రామీణ ప్రాంతం స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకప్పటి జమిందారీ విదానం, దొరల దోపిడీ పీడనలు, భూస్వాముల ఆగడాలు లేవు. కాబట్టి ఇప్పుడు మళ్లీ మావోయిస్టులు తెలంగాణాలో పట్టుసాధిస్తారనడం ఆసమంజసం. (‘నమస్తే తెలంగాణా’’: 20`7`013)!
 


(ఇదిలా ఉండగా, ఈనెల (జూలై) 2వ తేదీన తెలంగాణా సమస్యపై ‘కాంగ్రెస్‌పైన వత్తిడిని పెంచే పేరిట అయిదు వామపక్షాల (సి.పి.ఎం. మినహా) ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర సదస్సు జరుపుతారట. ఈ వామపక్షాలలో ఒకటయిన ‘న్యూఢమోక్రసీ’ (మార్క్సిస్టు... లెనినిస్టు) పార్టీ రాష్ట్ర నాయకుడైన డి.వి.కృష్ణా ఒక ప్రకటన చేస్తూ చెప్పిన మాటలు అందరూ పరిశీలించదగినవిగా ఉన్నాయి.



"రాష్ట్ర విభజన జరిగితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందనడం, తెలంగాణా ఏర్పడకుండా ఉంటే నక్సలైట్లు నిజంగానే పెరుగుతారనుకోవడం అనే రెండు వాదనలూ సరైనవికావు. తెలంగాణా ఏర్పడినంత మాత్రాన సమసమాజ వ్యవస్థ నెలకొంటుందని భావించలేము. ఇప్పటిమాదిరిగానే అప్పుడు కూడా ప్రజలు అణచివేతలకు దోపిడీకి గురి అవుతూనే ఉంటారు.'' అయినప్పడు (తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాగాని సమసమాజ వ్యవస్థ నెలకొన్నప్పుడు తెలుగు జాతి అనుపమానమైన త్యాగాల ద్వారా సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ను సమసమాజ వ్యవస్థ ఏర్పడకుండానే బలవంతంగా రాజకీయ నిరుద్యోగుల పాక్షిక పదవీ ప్రయోజనాలకోసం బలిపెట్టవలసిన అవసరందేనికొస్తోంది? విభజన కేవలం ‘విభజన’కోసమా? ‘సమసమాజ వ్యవస్థ’ నెలకొనాల్సిన అవసరం ఒక్క తెలంగాణా ప్రాంతానికే పరిమితమా, లేక యావత్తు తెలుగుజాతి కలలపంటైన యావత్తు విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ప్రజలకూ, రాష్ట్రానికీ అవసరం లేదా? యావత్తు రాష్ట్రంలోనూ అలాంటి ఉత్తమోత్తమ వ్యవస్థ అవసరాన్ని మనసారా అభిలషించే అభ్యుదయ వాది ఎవడైనా ఒక ప్రాంతం అభ్యుదయాన్ని మాత్రమే కోరుకోవడం సోషలిజం ప్రాధమిక లక్ష్యానికే విరుద్ధం కాదా? సోషలిజం మాట పెరుమాళ్లకెరుక, ఒకనాటి సోషలిస్టు సోవియట్ యూనియన్ రాజ్యాంగరీత్యా విడిపోయే హక్కును దాని సమాఖ్య సభ్యజాతులకు యిచ్చి కూడా సమాఖ్య రూపురేఖలు ఎందుకని చెల్లాచెదరైపోవలసి వచ్చింది?
 


యూనియన్‌ నుంచి విడిపోయిన రిపబ్లిక్కులకు కొన్ని అమెరికా.... పెట్టుబడి పాలనా వ్యవస్థకు ‘జోహామీం’ అనవలసి వస్తోంది? ఆ మాటకొస్తే యూరప్‌లోని కొన్నిదేశాలో కొన్ని రాష్ట్రాలు (ఒకే జాతీయులు) విడిపోయి మళ్లీ కలుసుకోవడానికి దారితీసిన పరిణామాలేమిటి? సహజవనరులు, నీటి పంపిణీ, వాటి నిర్వహణ తాలూకూ తలెత్తిన సమస్యలూ, తలనొప్పులూ ‘వామపక్షు’లకు తెలియవా? నిన్నగాకమొన్న నైయినదీజలాల పంపిణీ ఈజిప్టు దాని ఇరుగు పొరుగుల మధ్య ఎంతటి తీవ్రతితీవ్రమైన ఘర్షణలకు దారి తీశాయో వామపక్షులకు తెలియదా?! ఈ మధ్యనే విడిపోయిన ఐక్యసూడాన్‌ (ఉత్తర ` దక్షణ సూడాకలుగా) రెండుభాగాలూ మళ్లీ ఎందుకు పునరేకీకరణకోసం తహతహలాడుతూ ‘సంప్రతింపుల అధ్యాయాన్ని తెరవవలసి వచ్చింది? ఒకే సైద్ధాంతిక పునాదిమీద ఏర్పడిన, మార్క్సిను భావజాలకుల మధ్య అనైక్యత కూడా ఒకే జాతిప్రజల మధ్య విభజనకు కృత్రిమ పునాదులు లేపుతోంది! ఇప్పటికైనా ‘వామపక్షులు’ తెలుగు ప్రజల, తెలుగు సమాజం పరిపూర్ణ ప్రయోజనాల దృష్ట్యా పునరాలోచన చేసుకుని, రెండు రకాల పరాయి పాలనలవల్ల చెల్లా చెదరై శతాబ్దాల పాటు పరాయి పంచలలో బతుకులాడిస్తున్న తెలుగువారందరినీ ఒక్క గూడికి చేర్చిన తెలంగాణా సాయూధ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి పొంది చరితార్ధులు కాగలరని మనసారా కోరుకుందాం!!

గుంతకల్లులో కీలక నేతల వారసత్వ రాజకీయం

  ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో  పోలిస్తే ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీ లు మాత్రమే ఉండడంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడ వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.  2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరఫున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడ ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు.  ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారట. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు. అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ వస్తున్నారు.  అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్‌లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ, రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా లాంటి పెద్ద కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి విజయవంతం చేయడంతో ఆమెపై వైసీపీ క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ పెరిగిందట. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేత పెళ్లికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో  ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత  బలం చేకూర్చింది.  అందులోనూ వైసీపీలో వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడంతో  అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి  ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లాలోని సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు  టీడీపీ లో గుమ్మనూరు జయరాం ఇమడకపోవడం, అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పార్టీ అతనికి పరిస్థితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు.  అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీట్‌పై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కూడా కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.   ఆరు రోజుల అమెరికా పర్యటనలో  లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణే. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు. రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.   అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపైనే దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ వ్యాఖ్యానించారు.  

విజయసాయి కాషాయ మంత్రం..జగన్ కు కషాయం!

రాజకీయాలకు అలవాటు పడిన నాయకులు వాటిని వదులు కోవడానికి ఇష్టపడరు.  ఏదో ఆవేశంలో రాజకీయ వైరాగ్యం కలిగినా, మరీ ఆవేశపడి రాజకీయ సన్యాసం తీసుకున్నానంటూ ప్రకటనలు చేసేసినా.. ఆ ఆవేశం తగ్గాకా మళ్లీ వాళ్ల చూపు రాజకీయలవైపే అంటుంది. అడుగులు కూడా రాజకీయం వైపే పడతాయి. ఒక లగడపాటి రాజగోపాల్ అయినా, మరో ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా.. ఇంకో వడ్డే శోభనాదీశ్వరరావైనా అంతే. అవకాశం లేక, జనం మొచ్చక, ఒప్పక వీరంతా రాజకీయ ప్రకటనలకే పరిమితమయ్యారు. అయితే విజయసాయిరెడ్డి పరిస్థితి అది కాదు.విజయసాయి  అవేశంతో కంటే ఎంతో  ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.  ఎందుకంటే.. వైసీపీలో ఒక సమయంలో ఆయన జగన్ తరువాత జగనంతటి నాయకుడిగా వెలుగొందారు.  ఆయన రాజకీయ సన్యాసం ప్రకటించిన సమయంలో రాజకీయంగానే కాదు, కేసుల పరంగా కూడా నిండా మునిగి ఉన్నారు. ఇంత కాలం తన సర్వస్వం ధారపోసి పెంచిన పార్టీ దూరం పెట్టింది. అదే సమయంలో కేసులూ చుట్టుముట్టాయి. ఆ కేసుల నుంచి బయటపడాలంటే.. వైసీపీకి తాను దూరం అని నిరూపించుకోవాలి. అదే సమయంలో.. తన స్వేదంతో పెంచిన పార్టీలో.. తన ఉనికినే ప్రశ్నార్థకం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అవకాశం రావాలంటే.. పోలిటికల్ గా తాను న్యూట్రల్ గా ఉన్నాననీ, ఉంటాననీ నిరూపించుకోవాలి. అందుకే ఆ సమయంలో విజయసాయి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నట్లుగా ప్రకటించారని పరిశీలకులు విశ్లేషించారు. వారి విశ్లేషణలకు తగ్గట్టుగానే ఆయన వ్యవసాయమే వ్యాపకం అని ప్రకటించినా, సోషల్ మీడియా ద్వారా, చేయగలిగినంత రాజకీయం చేశారు. అలాగే కేసుల విచారణకు హాజరైన సందర్భంగా మీడియా ముందూ రాజకీయాలే మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టులకు ఆయన ఇచ్చిన లీకులే కారణమంటే అతిశయోక్తి కాదు. విజయసాయి వైసీపీ నుంచి బయటకు వచ్చి, రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మాటలు, చేతలు, అడుగులూ అన్నీ బయటకు జగన్ కోటరీ టార్గెట్ అన్నట్లు కనిపించినా.. ఆయన అసలు లక్ష్యం జగన్ అన్నట్లుగానే సాగాయి. అంతెందుకు విజయసాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన తరువాత హైదరాబాద్ వెళ్లి మరీ  జగన్ సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. ఆ తరువాత కూడా విజయసాయి పొలిటికల్ గా బీజేపీకి చేరువ అవుతున్నారన్న ప్రచారం జరిగింది.   ఇప్పుడు ఆ ప్రచారాలకీ, ఆ విశ్లేషణలకూ బలం చేకూర్చే విధంగా హిందుత్వకు మద్దతుగా ఆయన తన గళం వినిపించారు. అదీ అలా ఇలా కాదు.. వైసీపీ పునాదులే కదిలిపోయేంత గట్టిగా విజయసాయి బాం బు పేల్చారు. మొత్తంగా గత రెండు దశాబ్దాలుగా  జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలనీ, ఇందుకు ఒక కమిటీని వేయాలని విజయసాయి డిమాండ్ చేశారు. హిందుత్వకు ద్రోహం చేసిన వారిని ఎవరినీ విడిచిపెట్టకూడదని ఉద్ఘాటించారు. ఈ మాటల వెనుక ఆయన ఆయన ప్రధాన టార్గెట్ వైసీపీ అండ్ జగన్ అని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుందంటారు పరిశీలకులు. గత రెండు దశాబ్దాలుగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న కాలం నుంచి ఇప్పటి వరకూ జరిగిన మతమార్పిడులపై విచారణ జరిపించాలన్నది ఆయన చేసిన డిమాండ్.   వైఎస్ జమానాలో క్రైస్తవ మతంలోకి పెద్ద ఎత్తున మతమార్పిడులు జరగిన విషయం అందరికీ తెలి సిందే. ఇప్పుడు విజయసాయిరెడ్డి డిమాండ్  ద్వారా బీజేపీకి పదునైన ఆయుధాన్ని అందించారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు విజయసాయి ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవచ్చు కానీ, బీజేపీ గొంతుక వినిపించారు.  తద్వారా తన అడుగులు ఎటు అన్న సంకేతాలు ఇచ్చారు. విజయసాయి కాషాయం పుచ్చుకుంటే.. జగన్ కు ఇక గడ్డుకాలమేనన్నది పరిశీలకుల విశ్లేషణ

కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి

  కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్‌ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సు పథకాలను మాత్రమే ప్రచారం చేసుకుంటుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు  గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి  తెలిపారు. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణం : సీపీఐ

బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్ల ఇస్తే తొలగిస్తామనడం దారుణమన్ని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నరన్నారు.  అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసులు పడిపొవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దిని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారన్నారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ విద్యను ప్రైవేటికరణ చేసి చాల అన్యాయం చెస్తుందన్నారు. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు పాల్పడుతుందన్నారు. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారన్నారు.

మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్

  మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఉద్దేశించి పరుష పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై వెంకటాచలం పోలీస్ స్టేషన్‌లో మ‌రో కేసు నమోదైంది. చవటపాలెం సొసైటీ ఛైర్మన్ రావూరు రాధాకృష్ణ నాయుడు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ మద్యం కేసుకు సంబంధించిన కీలక ఫైళ్లు కూడా మాయమవడం కలకలం రేపుతోంది. 2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి నకిలీ మద్యం తెప్పించి, లేబుళ్లు మార్చి ఓటర్లకు పంపిణీ చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.  ఆనాడు ఈ నకిలీ మద్యం తాగి పలువురు మరణించగా, వందలాది మంది అనారోగ్యానికి గురయ్యారు.ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫైళ్లు 2018లోనే అదృశ్యమైనట్లు విజయవాడ ప్రత్యేక కోర్టు గుర్తించి, కేసును సీఐడీకి అప్పగించింది. అయితే, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. ఇప్పుడు కూటమి  ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. తనపై కేసు నమోదు కావడంతో కాకాణి తీవ్రంగా స్పందించారు. దేవాలయ భూములు అక్రమాలపై ప్రశ్నించినందుకే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సోమిరెడ్డికి దమ్ముంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్దమా అని సవాల్ విసిరారు.

వింటర్ లో హాట్ హాట్ గా మద్యం సేల్స్! నాలుగు రోజుల్లో రూ.600 కోట్లు!

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావించాల్సి వస్తోంది. ఎందుకంటేచలి పెరగడంతో గత నాలుగు రోజులలో  రాష్ట్రంలో  ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలుగా ఉన్నాయి.  వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో  తెలంగాణ మందుబాబులు ఖుషీ చేస్తున్నారని ఈ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే  మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.  రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ అంటే డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండటానికి  గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.  నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో  5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో  బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే. 

ఏపీ గ్రోత్ రేట్@10.5%

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటోంది.  ఈ ఏడాది ఏపీ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. వైసీపీ హయాంలో ఏపీ ప్రగతి తిరోగమనంలో సాగిన సంగతి తెలిసిందే.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత  దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26  ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.   దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఒక్క అంధ్రప్రదేశ్ మాత్రం జాతీయ సగటును మించిన వృద్ధి రేటు సాధించింది. ఈ వేగం ఇలాగే సాగితే  ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీ అభివృద్ధిలో సింహ భాగం వ్యవసాయానిదే అని చెప్పాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ ఉత్పత్తులు 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఈ వృద్ధి 36 శాతంగా ఉంది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం  పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్లనే  ఆర్థిక వ్యవస్థ పునాది గట్టిపడిందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 2047    ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , తలసరి ఆదాయం 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం దిశగా తొలి అడుగు పడిందనే తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.  పథకాల అమలులో వేగం,  అధికారుల చొరవ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వెల్లువ అన్నీ కూడా ఏపీ ప్రగతికి, పురోగతికి, ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తున్నాయని చెప్పాలి.    సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగింది. జగన్ హయాంలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు హయాంలో ఇప్పుడు కోలుకుని వేగంగా ముందుకు సాగుతోంది. 

ఏబీవీ కొత్త పార్టీ?!

దేశంలో ఇప్పటికే స‌వాల‌క్ష పార్టీలు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ గా ఉన్న‌వి కొన్నే. వాటిలో బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల‌తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, తృణ‌మూల్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు వీటికి అద‌నం. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే తెలుగుదేశం, వైసీపీ,  జ‌న‌సేన‌,  డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్ వంటి పార్టీలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలనూ కలిపితే దాదాపు ఓ పాతిక పార్టీలు యాక్టివ్ గా ఉన్నాయని చెప్పవచ్చు.  అలాంటి యాక్టీవ్ పార్టీల‌న్నిటినీ  ప‌క్క‌న పెడితే..   దేశంలో ఉన్న పార్టీల సంఖ్య సుమారు రెండున్న‌వేల వ‌ర‌కూ ఉంటాయి. రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న  తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ  కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.   ఆ పార్టీ పేరు ఇంకా  ఖరారు కాలేదు కానీ, పార్టీ ఏర్పాటైతే పక్కా అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది ఎవరయ్యా అని చూస్తే.. ఆయన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు. ఈయ‌న జ‌గ‌న్ జ‌మానాలో ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారో  తెలిసిందే. ఇటీవ‌ల ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చెప్పిన అపాల‌జీ వీడియోనే ప్ర‌త్య‌క్ష  సాక్షి. అదలా ఉంచితే..  ఏబీవీకి ఇంకా ప్ర‌భుత్వ ప‌రంగా రావ‌ల్సిన బ‌కాయిలు ఇప్పటికీ  రాలేదు. వాస్తవానికి ఏబీవీ   జ‌గ‌న్ పై పోరాడిన విధానికి కూట‌మి ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించాల్సి ఉంది. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నుంచి ఏబీవీకి ఎటువంటి మద్దతూ లభించలేదు.  అప్ర‌ధాన్య‌మైన పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగించి మమ అనేశారు. అయితే ఆయనా పోస్టు తీసుకోలేదనుకోండి అది వేరే సంగతి. అయితే   ఏబీవీ ప్ర‌స్తుతం చంద్ర‌బాబు మీద ఆయ‌న ప్ర‌భుత్వ విధానాల‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు.   అంతే కాదు వైసీపీ వారికి య‌ధేచ్చ‌గా దోచి పెడుతున్నార‌న్న సంచ‌ల‌న కామెంట్లు కూడా చేశారు. ఆమాట‌కొస్తే మొన్న‌టికి మొన్న కందుకూరు క‌మ్మ  కాపు ఘ‌ట‌న‌లో ప్ర‌భుత్వం  ఇచ్చిన న‌ష్ట‌ప‌రిహారంపై కూడా రియాక్టయ్యారు ఏబీవీ. ఇలా తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వ నిర్ణయాలను ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు.   ఇలా ఖండనలు, ప్రకటనలతో కాదని తానే స్వయంగా ఒక కొత్త  పార్టీ  పెట్టి  సత్తా చాటాలన్న నిర్ణయానికి ఏబీవీ వచ్చినట్లు కనిపిస్తోంది.   దేశంలోనే అత్యంత అవినీతి ప‌రుడిగా  వేల కోట్ల‌ను సంపాదించిన పేరు సాధించిన  జ‌గ‌నే పార్టీ న‌డ‌ప‌డానికి  డ‌బ్బుల్లేవు కాబ‌ట్టి తాను  కార్యాల‌యాన్ని తీసేశాన‌ని బాహ‌టంగా చెప్పుకున్నారు. అలాంటిది ఏబీవీ లాంటి ఒక రిటైర్డ్ ప్ర‌భుత్వోద్యోగి వ‌ల్ల సాధ్య‌మ‌వుతుందా? అని సందేహాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయితే  జ‌య ప్ర‌కాశ్ నారాయ‌ణ‌ లోక్ స‌త్తా  అరవింద్ కేజ్రీవాల్  ఆమ్ ఆద్మీ పార్టీ,  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ కూడా సేమ్ టు సేమ్  ఈయ‌న‌లాగానే ఐఏఎస్ ఐపీఎస్ కేడ‌ర్ కి సంబంధించిన వారే. వారిలో అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ క్లిక్ అయిన‌ట్టు మిగిలిన వారు పెట్టిన పార్టీలు రాణించ‌లేదు.  ఆ  కోవ‌లోకి వ‌చ్చే ఏబీవీ అంత‌గా మాస్ జ‌నాల్లోకి దూసుకెళ్ల‌గ‌ల‌రా? అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా  మారింది.  ఇక పార్టీ పేరు ఏమిటని చూస్తూ.. ఈయన ఏపీకి పరిమితమై రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు కనుక ఆంధ్ర శ‌బ్ధం వ‌చ్చేలా ఆయన పార్టీ పేరు ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా ఏబీవీ పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు ఆరంభం కానుంది? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది.  

మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది... అధైర్య పడొద్దు : కేసీఆర్

  బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లలు కేసీఆర్‌ను  ఫాం హౌస్‌ కలిశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ అన్ని కాలాలు మనకు అనుకులంగా ఉండవు కొన్ని కష్టాలు వస్తాయి. వాటికి కుంగి పోవద్దని తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయిని అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని వచ్చేది మన బీఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు.  కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు. గ్రామస్థుల మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాలువాలతో సత్కరించి వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను గుర్తుపట్టి పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితిని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారిన పరిస్థితిని, గ్రామస్తులు కేసీఆర్ దృష్టికి తెచ్చి ఆవేదన వ్యక్తం చేశారు