Read more!

ఆమెకు ౩౦ అబ్బాయికి 15 

ఆమెకు ౩౦ సంవత్సరాలు ముగ్గురు పిల్లలు.. భర్త, ముగ్గురు పిల్లలు మాత్రమే ఆమె ప్రపంచం అని కుటుంభం సభ్యులు అనుకున్నాడు.. జీవితం సాఫీగా గడుపుతున్న ఓ వివాహిత.. మిస్టరీ సినిమాలో సడెన్ గా కనిపించకుండా పోయింది.. ఇంట్లో కూడా గొడవ జరగలేదు ఎక్కడికి పోతుందిలే  చీకటి పడితే ఆమె ఇంటికి వచ్చేస్తుందని పిల్లలు కూడా అనుకున్నారు కుటుంబ సభ్యులు. కానీ వాళ్లు అనుకున్నట్లు  జరిగలేదు. ఎవరూ ఊహించని విధంగా ఆమె కుటుంబ  సభ్యులకు ట్విస్ట్ ఇచ్చింది. ఎప్పుడూ ఇల్లు దాటి వెళ్లని ఆ మహిళ మొన్న బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎటూ పోయిందో అని అంతా కంగారుపడ్డారు. అయితే అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే ఆ మహిళ.. 15 ఏళ్ల తమ అబ్బాయితో కలిసి వెళ్లిపోయిందని అబ్బాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడితో ఏడాదికాలంగా ఆ మహిళ సన్నిహితంగా ఉంటోంది. అయితే వారిద్దరి మధ్య ఉన్న వయసు వత్యాసం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. అయితే కొంతకాలంగా తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని.. కానీ దానికి అసలు కారణం ఇలా ఉంటుందని తాను ఊహించలేకపోయానని ఆమె భర్త పోలీసులుకు వివరించాడు.

ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పారిపోయిన ఆ ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు తమ కుమారుడిని త్వరగా తీసుకురావాలని.. అతడికి ఏమీ తెలియదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జరిగింది.