Read more!

8 ఏళ్లుగా డేటింగ్..  సుసైడ్స్ ట్విస్ట్.. 

వారిద్దరిది ఒకే రకం వ్యాపారం. వారు చేసే వ్యాపారం సేమ్ కాబట్టి మూడు మాటలు కలిశాయి.. ఈ తర్వాత మనసులు, తనువులు  కలిశాయి.. కొన్నాలు ప్రేమ మాధుర్యంలో మునిగితేలారు. సహజీవనం చేస్తూ పెళ్లి కాకుండానే ఒక్కటయ్యారు. అలా కాలం కొన్నాలు గడిచింది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు. ఒకటిగా కలిశాం ఒకటిగానే చనిపోదామనుకున్నారో ఏమో మరి.  ఇద్దరు ఒకే లాడ్జిలో వేర్వేరు రూములు తీసుకొని ఆత్మహత్య చేసుకుని వారి ముందు ఉన్న జీవితానికి ముగిపు పలికారు.   

ఈ విషయం తెలుసుకున్న ఇరుకుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకట్ గౌడ్.. 15 ఏళ్లుగా తిరుపతిలో ఉంటూ పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. తిరుపతిలోని సత్యనారాయణపురానికి చెందిన అనిత కూడా అదే ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న సయమంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఇద్దరు రేణిగుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ఇద్దరు రెండు రోజుల క్రితం రూమ్ తీసుకున్నారు. వేరువేరుగా గదులు అద్దెకు తీసుకున్న ఇద్దరు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వెంకట్ గౌడ్ ఓ గదిలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా.. అనిత.. మరో గదిలో ఉరివేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఐతే వీళ్లిద్దరికీ నాలుగేళ్ల క్రితం పెళ్లైనట్లు తెలుస్తోంది. నిజంగా పెళ్లైందా.. లేక సహజీవనమే చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారా..? లేక పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని బలవన్మరణానికి పాల్పడ్డారా..? అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.