పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవాల వివరాలు
posted on May 13, 2014 9:29AM
జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిన స్థానాల వివరాలివి. తెలంగాణలో 69 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 24 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు, తెరాసకు చెందిన 14 మంది అభ్యర్థులు, వామపక్షాల అభ్యర్థులు ఇద్దరు, ఇతరులు 26 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే సీమాంద్రలో 251 ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఒక జడ్పీటీసీ, 103 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచింది. వైకాపా 70 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, వామపక్షాలు 4 స్థానాల్లో, ఇతరులు 70 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలిచారు.