జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల చెప్పాలి: యనమల

వైకాపా అధ్యక్షుడు జగన్ జైల్లో ఎందుకున్నారో షర్మిల రాష్ట్ర ప్రజలకు చెప్పాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. పాదయాత్రకు రిలే మహాప్రస్థానం పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. మూడు వేళ కిలోమీటర్లలో ఎవరెంత నడుస్తారో ప్రజలకు ముందు తెలియజేయాలని కోరారు. రిలే మహాప్రస్థానం ప్రజల కోస౦ కాదని తన అన్న జగన్ కోసమే అని ఆయన విమర్శించారు.


మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ అన్నారు.  కోర్టు ఆదేశం మేరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు. ఈ కేసులో విదేశాల నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారమే కేసులో అత్యంత ప్రధానమైందని ఆయన అన్నారు. దర్యాప్తు పలు కోణాల్లో జరుగుతోందని చెప్పారు. ఓ కేసులో ఇలాంటి దర్యాప్తు సాగడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.