Read more!

కేసీఆర్ ను కలిసిన మోత్కుపల్లి..


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింపులు ఈ రోజు కలిశారు. దీంతో ఎప్పుడు కేసీఆర్ పై విమర్శలు గుప్పించే మోత్కుపల్లి కేసీఆర్ ను ఎందుకు కలిశారబ్బా అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోత్కుపల్లి నర్సింహులు తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన తరువాత అందరూ ఎంత తిట్టుకున్నా ఇద్దరూ పాత మిత్రులే కదా అని అనుకున్నారట.