Read more!

మాకూ చీము నెత్తురుంది, ప్రభుత్వాన్ని కూల్చగలం: కోమటిరెడ్డి

 

 

 

 

రాజీనామాల బెదిరింపులతో సీమాంధ్ర నేతలు ఈ నెల 28న తెలంగాణపై ప్రకటన రాకుండా అడ్డుకున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. మాకూ చీము, నెత్తురు ఉంది. ఈ నెలలో తెలంగాణ రాకపోతే ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.

 

ఈ రోజు కేసీఆర్‌తో భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మున్ముందు కఠిన నిర్ణయాలు తప్పవని అన్నారు. వాయిదాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న కేంద్రం తెలంగాణ ఇస్తుందో లేదో అని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రకటనపై ఎల్లుండి వరకూ వేచి చూస్తామని, ప్రకటన వెలువడకుంటే 28 తర్వాత కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు.