ఆ నిర్ణయమే తీసుకుంటే వాట్సప్ తో నో పర్సనల్ చాటింగ్
posted on Sep 22, 2015 @ 10:12AM
స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వాళ్లకి వాట్సప్ గురించి తెలిసే ఉంటుంది. ఒక్క ఛాటింగ్ మాత్రమే కాకుండా ఫోటోలు.. చిన్న చిన్న వీడియోలు సైతం ఈ వాట్సప్ ద్వారా పంపించుకునే సౌకర్యం ఉంది కాబట్టే ఈ యాప్ అంత పాపులర్ అయింది. ఒక్కరని కాదు ప్రతి ఒక్కరూ ఆఖరికి రాజకీయ వేత్తలు కూడా ఈ వాట్సప్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం వాట్సప్ విషయంలో చట్టపరంగా తీసుకోబేయే ఒక నిర్ణయం ద్వారా వినియోగదారులకు షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే వాట్సప్ ఉపయోగించేవారు తాము ఛాటింగ్ చేసిన మెసేజ్ లను మూడు నెలల వరకూ డిలీట్ చేయకూడదని.. వాటిని మూడు నెలల పాటు అలాగే ఉంచాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ చట్టపరమైన నిర్ణయమే తీసుకొన్నట్లయితే వాట్సప్ వినియోగదారులు ఖచ్చితంగా మెసేజ్ లను మూడు నెలల పాటు డిలీట్ చేయకుండా ఉంచాల్సిందే. అప్పుడు వినియోగదారులు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ఆచితూచి చాటింగ్ చేయాల్సిన పరిస్థితి వుంటుంది... దీనివల్ల అవసరమైతే వినియోగదారులు వాట్సప్ వినియోగించడం మానేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.