సుశాంత్తో బ్యాంకాక్కు వెళ్లినట్లు ఒప్పుకున్న సారా!
on Sep 26, 2020
దీపికా పడుకోనే, రకుల్ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లాంటి పేరుపొందిన తారలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూర్ (ఎన్సీబీ) ఇంటరాగేషన్కు హాజరై అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పలు కొత్త అంశాలు, రహస్యాలు వెలుగులోకి వచ్చాయని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. సుశాంత్సింగ్ రాజ్పుత్తో డ్రగ్స్ తీసుకున్నారా అనే ప్రశ్నకు తాము తీసుకోలేదని రకుల్, శ్రద్ధ తెలిపారు. అయితే తన మేనేజర్ కరిష్మా ప్రకాష్తో డ్రగ్ చాట్స్ చేసినట్లు దీపికా పడుకోనే అంగీకరించిందనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అలాగే, సుశాంత్తో అనుబంధం విషయమై సారా అలీఖాన్ సైతం ఓ విషయం అంగీకరించిందని ప్రచారంలోకి వచ్చింది. ఎన్సీబీ ఇంటరాగేషన్ సందర్భంగా, బ్యాంకాక్ ట్రిప్కు సుశాంత్తో కలిసి వెళ్లినట్లు ఆమె ఒప్పుకుందని టైమ్స్ నౌ తెలిపింది. అయితే అతనితో కలిసి డ్రగ్ తీసుకోలేదని ఆమె స్పష్టం చేసింది. స్నేహితులతో కలిసి వెళ్లడానికి బ్యాంకాక్ ట్రిప్ కోసం సుశాంత్ ఓ చార్టర్ ప్లేన్ బుక్ చేశాడనీ, వాళ్లతో పాటు సారా కూడా వెళ్లిందనీ, సుశాంత్ ఫ్రెండ్స్ వెల్లడి చేసిన విషయంపై ఎన్సీపీ దృష్టి సారించింది. దానిపై సారాను ప్రశ్నించింది. ఆ టైమ్లో సుశాంత్, సారా డేటింగ్లో ఉన్నారని కూడా ఫ్రెండ్స్ వెల్లడించారు.
Also Read