బిగ్ బాస్ 4.. వచ్చీ రాగానే నలుగురితో స్వాతి దీక్షిత్ పార్టీ!
on Sep 26, 2020
బిగ్ హౌస్ లో అడుగుపెట్టిన కొత్త కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ కు ఇంటి సభ్యులు స్టెప్పులతో స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు అయ్యాక అందరూ హాల్ లో కూర్చున్నారు. "హౌస్ లోకి కొత్తగా వచ్చిన స్వాతి హౌస్ లోని మగవారి కోసం స్పెషల్ గిఫ్ట్ తీసుకువచ్చింది. అదేమిటో తెలుసుకోవాలంటే ఆమెను ఇంప్రెస్ చేయాలి" అంటూ బిగ్ బాస్ సూచించాడు. దాంతో అమ్మ రాజశేఖర్, అవినాష్ డైలాగ్స్ తో, అఖిల్, అభిజిత్, నోయల్ పాటలతో, మోహబూబ్ ఫుషప్స్ తో ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. అఖిల్, అవినాష్, నోయల్, అమ్మరాజశేఖర్ లు ఇంప్రెస్ చేశారంటూ వారికి గులాబీలు అందించింది స్వాతి.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలిచిన నలుగురు స్వాతితో కలిసి పార్టీ చేసుకునేందుకు అనుమతి ఇచ్చాడు బిగ్ బాస్. పార్టీ ఏరియాలోకి, లాన్ లోకి ఇంటిసభ్యులకు ప్రవేశం లేదని చెప్పాడు. దాంతో ఇంటిసభ్యులు పార్టీచేసుకుంటున్న వారిని చూస్తూ వారి పాటలకు స్టెప్పులేశారు. జిగేలు రాణి పాటకు స్వాతితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ తర్వాత గంగవ్వతో స్వాతి కాసేపు మాట్లాడింది. అఖిల్ కు మోనాల్ చపాతి తినిపిస్తే, స్వాతికి అభిజిత్ ఇప్పటివరకు హౌస్ లో జరిగిన విషయాలు వివరించాడు. అయితే వీకెండ్ షో కావడంతో నెక్ట్స్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న టెన్షన్ నామినేషన్ జాబితాలో ఉన్న కంటెస్టెంట్లలో కనిపించింది.
Also Read