మహేష్ `సరిలేరు నీకెవ్వరు`
on May 31, 2019
మహర్షి తర్వాత మహేష్ 26 చిత్రంగా `సరిలేరు నీకెవ్వరు` చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ జన్మదిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఎప్పటిలాగే మహేష్ బాబు ప్రారంబోత్సవానికి హాజరు కాలేదు. ఇక మహేష్ సరసన ఇటీవల వార్తలు వచ్చినట్లు రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మ్యూజిక్ మిస్సైల్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు టైటిల్ డిజైన్ , టైటిల్ లో తుపాకి దానిపైన మిలిటరీ క్యాప్ పెట్టడంతో సినిమా నేపథ్యం గురించి ఇప్పటికే సినీ పరిశ్రమల్లో చర్చలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించడంతో నిజంగానే సరిలేరు మీకెవ్వరు అంటున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై దిల్ రాజు , రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక త్వరలో చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.