సైరా దర్శక నిర్మాతలకు వైరం ముదిరిందా!!!
on Jan 30, 2019
మెగాస్టార్ చిరంజీవి `సైరా నరసింహారెడ్డి` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి , నిర్మాత రామ్ చరణ్ కు అంతగా పడట్లేదని తెలుస్తోంది. ఎందుకో తెలియదు కానీ షూటింగ్ జరుగుతున్న తీరుపై చరణ్ కాస్త అసంతృప్తితో ఉన్నాడని బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో చరణ్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై దర్శకుడితో మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై చరణ్ కాస్త సీరియస్ అయినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ముందు 150 కోట్లతో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు చేరిపోవడంతో ఆ టెన్షన్ చరణ్ లో కనిపిస్తుందంటున్నారు చిత్ర యూనిట్. సురేందర్ రెడ్డి కూడా పర్పెక్షన్ పేరుతో తీసిన సీన్స్ మళ్లీ ఎక్కువగా రీ షూట్ చేస్తున్నాడనే వాదన వినిపిస్తుంది. ఇదే దర్శకుడికి , నిర్మాతకు మధ్య వాగ్వాదం జరిగే వరకు తీసుకొచ్చిందని తెలుస్తుంది. అయితే ఏదేమైనా వస్తున్న ఔట్ పుట్ చూసి రామ్ చరణ్ ఫిదా అవుతున్నాడని కాకపోతే కాస్త ఆలస్యం అవుతున్న కారణంగానే కోపంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా సురేందర్ రెడ్డి త్వరలోనే పూర్తి చేస్తాడని , ఇప్పటి వరకు కేవలం 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి కావడంతో దసరాకు సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. కానీ ఖచ్చితంగా చరణ్ మాత్రం పండక్కి సినిమా కావాలని దర్శకుడిని అడిగినట్లు తెలుస్తుంది. తమన్నా, నయనతార ఇందులో చిరంజీవికి జోడిగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి , అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మరి మొత్తానికి ఈ చిత్రం ఎప్పుడు వస్తుందో చూడాలి.