ప్రభాస్ డైరెక్టర్తో గోపీచంద్ సినిమా?
on Nov 24, 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన జిల్ తో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పుడు గోపీచంద్ దర్శకుడితో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లే.. త్వరలో ప్రభాస్ డైరెక్టర్ కాంబినేషన్ లో గోపీచంద్ ఓ మూవీ చేయబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది ప్రభాస్ తో సాహో వంటి పాన్ ఇండియా మూవీని చేసిన సుజీత్.. త్వరలో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సబ్జెక్ట్ కోసం గోపీచంద్ తో సంప్రదింపులు కూడా జరిపాడని.. గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. మరి.. దర్శకుల ఎక్స్ ఛేంజ్ ఆఫర్ ప్రభాస్, గోపీచంద్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.