రాజకీయాల్లోకి అనసూయ
on Jul 2, 2018
కంగారుపడకండి ఇది కేవలం సినిమాల్లోనే. మొన్నటివరకూ జబర్దస్త్తో ఆకట్టుకున్న అనసూయ, రంగమ్మత్త పాత్రతో ఓ వెలుగు వెలిగిపోయింది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ రంగమ్మత్త కెరీర్ని మలుపు తిప్పే మరో పాత్ర ఇప్పుడు ఆమె తలుపు తట్టిందట. కర్నూల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన శోభా నాగిరెడ్డి గుర్తుకున్నారు కదా! శోభా నాగిరెడ్డి, ఆమె భర్త భూమానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తిరుగులేని నాయకులుగా ఉండేవాళ్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఆమె ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఓ రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా చనిపోయారు శోభా. ఆమె చనిపోయిన మూడేళ్లకి భర్త భూమానాగిరెడ్డి కూడా చనిపోయారు. ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్లో భాగంగా ఆ శోభానాగిరెడ్డి పాత్రను అనసూచ వేస్తున్నట్లు సమాచారం. అంటే మన రంగమ్మత్త కాస్తా రాజకీయనాయకురాలిగా మారిపోతుందన్నమాట.