అమెరికాలో గుర్రం పరుగే పరుగు
on Apr 14, 2014
అల్లు అర్జున్, శృతిహాసన్ కలిసి నటించిన తాజా చిత్రం "రేసుగుర్రం". ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ఓవర్ సీస్ లో కూడా తన హవా కొనసాగిస్తుంది. ఈ సినిమా ఒక్క అమెరికాలోనే అన్ని థియేటర్లలో కలిపి 3,13,000 డాలర్లు (1,88,00,000రూపాయలు) వసులు చేసింది. ఇది బన్నీ కెరీర్ లో హయ్యెస్ట్ గా ఉందని, ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయని ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో విడుదల చేసిన ఫికప్ సంస్థ ఈ విషయాన్నీ వెల్లడించింది. తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి వసూళ్లను రాబడుతూ విజయ పథంలో దూసుకుపోతుంది.
బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.