మరో చిత్రానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్
on Apr 22, 2014
"సాహసం" సినిమాతో విజయాన్ని అందుకున్న నటుడు గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. అదే విధంగా బి.గోపాల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే గోపీచంద్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
"సాహసం" సినిమాకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ఇటీవలే గోపికి ఓ కథ వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.